BRS: నిరుద్యోగుల అరెస్టును ఖండించిన ఎర్రోళ్ల శ్రీనివాస్

Published 2024-07-05 16:31:53

postImages/2024-07-05/1720177313_sribrs.PNG

న్యూస్ లైన్ డెస్క్: నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నాయకుల అరెస్టును  బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి డా. ఎర్రోళ్ల శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత ఏడు నెలలుగా నిరుద్యోగుల సమస్యలను పట్టించుకోలేదని వాపోయారు. వారి సమస్యలను వినడానికి ఒక్క మంత్రి, అధికారి అందుబాటులో వారితో చర్చలు జరపకపోవడం సిగ్గుచేటు అని విమర్శించారు. ఇది ప్రజా పాలన కాదు, నిర్బంధ పాలన అన్నారు. పోలీసులు రాత్రి నుండే అమ్మాయిలని కూడా చూడకుండా అరెస్టు చేయడంపై మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు అనేక ఆశలు కల్పించి ఎన్నికల్లో వారిని వాడుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని రొడ్డుకీడ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇప్పటికైనా నిరుద్యోగులతో చర్చలు జరిపి వారి యొక్క న్యాయపరమైన డిమాండ్లను, హామీలను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించే దాక, డిమాండ్లు సాధించే దాకా వదిలిపెట్టమని, విద్యార్థులు, నిరుద్యోగుల తరుపున గొంతెత్తుతామని స్పష్టం చేశారు. విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు, నిరుద్యోగుల అరెస్టులను తక్షణం నిలిపివేసి, అరెస్టులు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ ఎర్రోళ్ల శ్రీనివాస్ డిమాండ్ చేశారు.