Vinod Kumar: బండి సంజయ్‌ మీ చరిత్ర చెప్పమంటావా?

కేంద్ర మంత్రి బండి సంజయ్‌‌పై మాజీ ఎంపీ వినోద్‌ కుమార్ ఫైర్ అయ్యారు. కేంద్ర హోం శాఖా సహాయ మంత్రి హోదాను బండి సంజయ్ కాపాడుకోవాలని, మేము బాంఛన్ అంటే కవిత ఎప్పుడో బయటకు వచ్చేదన్నారు. చట్ట ప్రకారం కొట్లాడదామనే మేము ముందుకు వెళ్ళామని తెలిపారు.


Published Aug 27, 2024 06:48:14 AM
postImages/2024-08-27/1724755036_vinodfire.PNG

న్యూస్ లైన్ డెస్క్: కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌‌పై మజీ ఎంపీ వినోద్‌ కుమార్ ఫైర్ అయ్యారు. ఎమ్మెల్సీ కవిత బెయిల్‌పై సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. మంగళవారం తెలంగాణ భనల్‌లో ప్రెస్ మీట్ నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ విలీనం అయిందని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. బండి సంజయ్ అనాలోచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, బండి సంజయ్‌కి అసలు తెలివి ఉందా అని ఆయన ప్రశ్నించారు. సుప్రీంకోర్టులో లాయర్లు పార్టీల తరపున ఉండరు అని, ముకుల్ రోహత్గీ బీజేపీ ప్రభుత్వంలో సుప్రీంకోర్టులో అటార్నీ జనరల్‌గా ఐదేళ్ళు పని చేశారు.. ముకుల్ రోహత్గీ సీనియర్ లాయర్ అని తెలిపారు. 

కేంద్ర హోం శాఖా సహాయ మంత్రి హోదాను బండి సంజయ్ కాపాడుకోవాలని, మేము బాంఛన్ అంటే కవిత ఎప్పుడో బయటకు వచ్చేదన్నారు. చట్ట ప్రకారం కొట్లాడదామనే మేము ముందుకు వెళ్ళామని తెలిపారు. స్త్రీలను ఇబ్బంది పెట్టిన బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్‌పై చర్యలు తీసుకోలేదన్నారు. బీజేపీలో చేరిన హిమంత బిశ్వశర్మపై కేసులు లేకుండా చేసి సీఎంను చేశారని గుర్తు చేశారు. ఏపీలో టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఇద్దరు రాజ్యసభ సభ్యులపై ఈడీ కేసులు ఎందుకు నడవడం లేదు.. ఇలా చెప్పుకుంటూ పోతే బీజేపీలో చేరిన ఎంతో మంది నేరచరితులపై విచారణ జరగడం లేదన్నారు. బీజేపీలో చేరితే కేసులు లేకుండా చేస్తున్నారని వినోద్ కుమార్ అన్నారు. 

తెలంగాణ ఉద్యమంలో ఎమ్మెల్సీ కవిత సాంస్కృతికపరంగా కీలక పాత్ర పోషించారని, బతుకమ్మ పండుగను ప్రపంచవ్యాప్తంగా కవిత తీసుకువెళ్లారని ఆయన గుర్తు చేశారు. రాజకీయ నేతలు ఈ కేసులో లేకపోతే 15 రోజుల్లో బెయిల్ వచ్చే కేసు ఇది అని అన్నారు. బీజేపీ వ్యతిరేక పార్టీలకు చెందిన రాజకీయ నేతలు ఈ కేసులో ఉన్నారు కాబట్టే జైల్లో పెట్టారని విమర్శించారు. ఢీల్లి లిక్కర్ కేసులో ఒక్క రూపాయి రికవరీ చేయలేదని, లిక్కర్ పాలసీ నిర్ణయంపైన కేసులు పెట్టారని మండిపడ్డారు. చార్జీషీట్ దాఖలు చేసిన తర్వాత జైల్లో ఎందుకు ఉండాలని కోర్టు అడిగింది. అడిషనల్ సాలిసిటర్ జనరల్ ఆ ప్రశ్నకు నీళ్లు నమిలారు. సూచనలు తీసుకుని సమాధానం తీసుకుని సమాధానం చెబుతా అని ఆయన అన్నారు. అంటే ఎన్ని రోజులు జైల్లో ఉండాలనేది అమిత్ షా నిర్ణయిస్తారా అని నిలదీశారు. మహిళలకు బెయిల్ విషయంలో కొన్ని చట్టబద్ధమైన హక్కులు ఉంటాయి అని, ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టిందని ఆయన తెలిపారు. ఆలస్యం అయినా ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వచ్చిందన్నారు. 

newsline-whatsapp-channel
Tags : telangana brs bandi-sanjay vinod-kumar mlc-kavitha bail-petition

Related Articles