Harish Rao: పల్లా రాజేశ్వర్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్న

గాంధీ ఆసుపత్రిలో ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న మోతీలాల్ నాయక్ ను పరామర్శించేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ నాయకులు పల్లా రాజేశ్వర్ రెడ్డి సహా ఇతర విద్యార్థి నాయకులను అరెస్టు చేయడాన్ని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రంగా ఖండించారు.


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-01/1719828466_harishboss.webp

న్యూస్ లైన్ డెస్క్: గాంధీ ఆసుపత్రిలో ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న మోతీలాల్ నాయక్ ను పరామర్శించేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ నాయకులు పల్లా రాజేశ్వర్ రెడ్డి సహా ఇతర విద్యార్థి నాయకులను అరెస్టు చేయడాన్ని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. నిరుద్యోగుల డిమాండ్లు పరిష్కారించాల్సింది పోయి, పరామర్శించేందుకు వస్తున్న వారిని అడ్డుకోవడం అప్రజాస్వామికం అన్నారు. ఇదేనా మీ ప్రజా పాలన అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డాని నిలదీశారు. ఎన్నికల సమయంలో హామీలతో ఊదరగొట్టిన నాయకులకు నిరుద్యోగుల ఆవేదన ఎందుకు అర్థం కావడం లేదన్నారు. అక్రమ అరెస్టులు చేసిన వారిని తక్షణం వదిలిపెట్టాలని, నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని హరీష్ రావు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే గాంధీ అసుపత్రికి వచ్చి మోతీలాల్ నాయక్ నిరాహార దీక్ష విరమించేలా చూడాలని కోరారు.

newsline-whatsapp-channel
Tags : telangana mla brs harish-rao palla-rajeswar-reddy

Related Articles