BRS: కాంగ్రెస్‌లోకి పఠాన్‌చెరు ఎమ్మెల్యే

పఠాన్ చెరు బీఆరెస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు


Published Jul 15, 2024 08:43:06 PM
postImages/2024-07-15//1721056386_mahipal.jfif

న్యూస్ లైన్ డెస్క్: పఠాన్ చెరు బీఆరెస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యేతో పాటు పలువురు కార్పొరేటర్లు, అనుచరులు కాంగ్రెస్ లో చేరారు. ఈ కార్యక్రమంలో సీఎంతోపాటు మంత్రులు దామోద‌ర రాజ‌న‌ర‌సింహ‌, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి తదితరులు ఉన్నారు. ఇప్పటి వరకు బీఆర్‌ఎస్‌ నుంచి పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. మహిపాల్ రెడ్డి 2014, 2019, 2023 ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలుపోందారు. 

 

కాంగ్రెస్ లోకి పఠాన్ చెరు బీఆరెస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, జహీరాబాద్ బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్

కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
pic.twitter.com/QPXiHLbPSB

— Sarita Avula (@SaritaAvula) July 15, 2024 ">http://

 

newsline-whatsapp-channel
Tags : telangana mla brs cm-revanth-reddy mahipalreddy

Related Articles