KCR: కేసీఆర్ దంపతుల ప్రత్యేక పూజలు

సిద్ధిపేట జిల్లా ఎర్రవెల్లి నివాసంలో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వేద పండితులతో నవగ్రహ యాగం చేపట్టారు.


Published Sep 06, 2024 12:03:28 PM
postImages/2024-09-06/1725604408_yagam.PNG

న్యూస్ లైన్ డెస్క్: సిద్ధిపేట జిల్లా ఎర్రవెల్లి నివాసంలో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వేద పండితులతో నవగ్రహ యాగం చేపట్టారు. శుక్రవారం ఎర్రవెల్లి ఫామ్హౌస్లో కేసీఆర్ దంపతుల ప్రత్యేక పూజలు చేశారు. కేసీఆర్‌కు ముందు నుంచి దైవ భక్తి ఎక్కువ ఉంది. దైవాన్ని చాలావరకు నమ్ముతుంటారు. ప్రతీ ఆధ్యాత్మిక కార్యక్రమంలోనూ పాల్గొంటుంటారు. వీలు చిక్కినప్పుడల్లా తన ఫామ్‌హౌస్‌లో ప్రత్యేక పూజలు, యాగాలు చేపడుతుంటారు. గతంలో 2016లో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చండీయాగం చేశారు. 2018లో మరో దఫా ఎన్నికలకు వెళ్లే ముందు తనకు చెందిన ఎర్రవెళ్లి ఫామ్‌హౌస్‌లో రాజశ్యామల యాగం చేశారు. అలాగే మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు నవంబర్ 1 నుంచి మూడు రోజులపాటు రాజశ్యామల యాగం అని చేశారు.

newsline-whatsapp-channel
Tags : kcr telangana ts-news brs-cheif

Related Articles