KTR: కారంపూరి కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్

తెలంగాణ ఐటీ శాఖ ఎలక్ట్రానిక్స్ విభాగం మాజీ డైరెక్టర్ సుజయ్ కారంపూరి కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు.


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-17/1721195619_ktrcondolence.jpg

న్యూస్ లైన్ డెస్క్: తెలంగాణ ఐటీ శాఖ ఎలక్ట్రానిక్స్ విభాగం మాజీ డైరెక్టర్ సుజయ్ కారంపూరి కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. ఐటీ శాఖ ఎలక్ట్రానిక్స్ విభాగం మాజీ డైరెక్టర్ సుజయ్ కారంపూరి తండ్రి ప్రొఫెసర్ సుభాష్ నిన్న రాత్రి పరమపదించారు. బుధవారం హైదరాబాద్ బండ్లగూడలోని సుజయ్ కారంపూరి ఇంటికి వెళ్లి వారి తండ్రి పార్థివ దేహానికి నివాళులు అర్పించిన కేటీఆర్ సుభాష్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. సుజయ్ కుటుంబానికి తన సంతాపాన్ని తెలియజేశారు. ప్రొఫెసర్ సుభాష్ సుదీర్ఘ కాలం పాటు కాకతీయ యూనివర్సిటీ పరిధిలో అనేక హోదాల్లో పనిచేశారు. తెలంగాణ ఉద్యమంలో కూడా పాలుపంచుకున్నారు. 

newsline-whatsapp-channel
Tags : telangana brs ktr family

Related Articles