BRSV: ఎమ్మెల్యే సబితాకి సీఎం క్షమాపణ చెప్పాలి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దిష్టిబొమ్మలను దహనం మహేశ్వరం బీఆర్ఎస్ కార్యకర్తలు చేశారు.


Published Jul 31, 2024 10:06:37 AM
postImages/2024-07-31/1722438385_brsv2.JPG

న్యూస్ లైన్ డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దిష్టిబొమ్మలను దహనం మహేశ్వరం బీఆర్ఎస్ కార్యకర్తలు చేశారు. ఎమ్మెల్యే సబిత ఇంద్రారెడ్డిని అసెంబ్లీలో అవమానించారంటూ సీఎం రేవంత్, భట్టి దిష్టిబొమ్మలను వారు దహనం చేశారు. అటు ఓయూలో కూడా రేవంత్ అనుచిత వ్యాఖ్యలను నిరసనగా రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్‌ఎస్వీ విద్యార్థులు ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ నిరసన తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను విద్యార్థులు దహనం చేశారు. బీఆర్‌ఎస్వీ నేత చటారి దశరథ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. 

newsline-whatsapp-channel
Tags : telangana mla brs cm-revanth-reddy sabithaindrareddy

Related Articles