CS: ఆర్థిక శాఖలో పని విభజన 

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆర్థిక శాఖలో పని విభజన చేశారు. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-19/1721382369_cs22.PNG

న్యూస్ లైన్ డెస్క్: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆర్థిక శాఖలో పని విభజన చేశారు. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్ రామకృష్ణారావుకు పని భారం తగ్గించింది. గత కొంతకాలంగా రామకృష్ణ రావు అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారు. దాంతో సందీప్ కుమార్ సుల్తానీయా, కృష్ణ భాస్కర్ కు పలు సబ్జెక్టులను సీఎస్ కేటాయించారు. సందీప్ కుమార్ సుల్తానీయాకు రెవెన్యూ, హోమ్, పంచాయతీరాజ్, హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, ఎస్సి డెవలప్మెంట్, డైరెక్టరేట్ ఆఫ్ ట్రెజరిస్ అండ్ అకౌంట్స్, పే అండ్ అకౌంట్స్ ఆఫీస్, డైరెక్టరేట్ ఆఫ్ వర్క్స్ అకౌంట్స్ విభాగాలు అప్పగించారు. ఇక కృష్ణ భాస్కర్ కు ఫైనాన్స్ కమీషన్, ఓపి అండ్ ఎస్టాబ్లిష్ మెంట్, ప్రాజెక్టు డైరెక్టరేట్ ఆఫ్ డీబీటి స్కీం, ట్రన్స్పోర్ట్, ఆర్ అండ్ బి, ఐ అండ్ పీఆర్, ఎండోమెంట్, ఎన్విరాల్ మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, హౌజింగ్, ఎనర్జీ, ఇండస్ట్రీస్, ఐటి విభాగాలు అప్పగించారు. 

newsline-whatsapp-channel
Tags : telangana appointment official-announcement

Related Articles