Cm Revanth: మున్నేరు భాదితులతో మాట్లాడిన సీఎం రేవంత్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మంకు చేరుకున్నారు. మున్నేరు వరద ప్రభావిత కాలనీలను సీఎం రేవంత్ పరిశీలించి.. భాదితులతో మాట్లాడారు.


Published Sep 02, 2024 05:57:02 PM
postImages/2024-09-02/1725280022_gmkm.PNG

న్యూస్ లైన్ డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మంకు చేరుకున్నారు. మున్నేరు వరద ప్రభావిత కాలనీలను సీఎం రేవంత్ పరిశీలించి.. భాదితులతో మాట్లాడారు. పోలేపల్లి రాజీవ్ గృహకల్ప కాలనీని సీఎం పరిశీలించారు. రాజీవ్‌ గృహకల్ప వాసులకు తీవ్ర నష్టం జరిగిందని, నష్టపోయిన ప్రతి కుటుంబానికి నిత్యావసరాలతో పాటు రూ.10 వేలు ఇవ్వాలని సీఎం రేవంత్ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. ఇంటింటి సర్వే చేసి నష్టాన్ని అంచనా వేస్తామని, అందరూ ధైర్యంగా ఉండాలని సీఎం రేవంత్‌ అన్నారు. అనంతరం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు అలుగు వరద ప్రాంతాన్ని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిశీలించారు. 

newsline-whatsapp-channel
Tags : telangana congress rains cm-revanth-reddy heavy-rains khammam-floods

Related Articles