Congress: జగ్గారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.


Published Sep 07, 2024 03:56:25 PM
postImages/2024-09-07/1725704785_jaga.PNG

న్యూస్ లైన్ డెస్క్: కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శనివారం గాంధీ భవన్‌లో ప్రెస్ మీట్ నిర్వహించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు కావాలంటే కోట్లు ఖర్చు పెట్టాలని ఆయన అన్నారు.  సంగారెడ్డి ఎమ్మెల్యే సీటుకి 50 కోట్లు ఖర్చు పెట్టాలని, పటాన్‌చెరు ఎమ్మెల్యే సీటుకి 100కోట్లు ఖర్చు పెట్టాలని ఆయన వ్యాఖ్యానించారు. 

ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో కులాలతో రాజకీయం నడుస్తలేదని, పైసలతో మాత్రమే నడుస్తుందని ఆయన అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ పదవి కోసం ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కాగా, తాజాగా కాంగ్రెస్ హైకమాండ్ పీసీసీ పదవిని మహేష్ కుమార్ గౌడ్‌కి కట్టబెట్టింది. దీంతో జగ్గారెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. 

newsline-whatsapp-channel
Tags : telangana congress cm-revanth-reddy congress-government pcc-chief

Related Articles