congress: సొంత పార్టీ ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ మేయర్

సొంత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పై కాంగ్రెస్ మేయర్ ఫిర్యాదు చేశారు.


Published Jul 25, 2024 06:53:18 PM
postImages/2024-07-25/1721913798_comp.PNG

న్యూస్ లైన్ డెస్క్: సొంత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పై కాంగ్రెస్ మేయర్ ఫిర్యాదు చేశారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించలేదు అంటూ ఆరోపణలు చేశారు. రాజేంద్రనగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, కమిషనర్‌పై కలెక్టర్‌కు కాంగ్రెస్ బండ్లగూడ మేయర్ ఫిర్యాదు చేశారు. బీఆర్‌ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కాంగ్రెస్‌లో చేరి తనపై పెత్తనం చల్ల ఇస్తున్నాడని మేయర్ ఆరోపించారు. 

నగరంలో ఏ అభివృద్ధి పనులు జరిగిన ప్రోటోకాల్ పాటించడం లేదని మండిపడ్డారు.పలు శంకుస్థాపన కార్యక్రమాలకు మీటింగ్ గురించి అడగగా, కమిషనర్ ఆ మీటింగ్‌ను వాయిదా వేసి మున్సిపల్ మేయర్, కార్పొరేటర్లకు చెప్పకుండా శంకుస్థాపనలు చేస్తున్నారని తెలిపారు. దీని మీద ఎమ్మెల్యే రాజేందర్ గౌడ్‌పై, కమిషనర్‌పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు బండ్లగుడ మేయర్ లతప్రేమ్ గౌడ్ ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఈ విషయమై వెంటనే స్పందించి ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని మేయర్ కోరారు. 
 

newsline-whatsapp-channel
Tags : telangana congress cm-revanth-reddy mayor

Related Articles