Encounter : మావోయిస్టు అగ్రనేత ఎన్ కౌంటర్


Published Sep 04, 2024 03:59:35 PM
postImages/2024-09-04/1725445775_encounter.jpg

న్యూస్ లైన్ డెస్క్ : ఛత్తీస్ గఢ్ అడవుల్లో పోలీసులకు మావోయిస్టులకు జరిగిన ఎన్ కౌంటర్ లో మావోయిస్టు అగ్రనేత, తొలితరం నాయకుడు మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. మావోయిస్టు పార్టీ తొలితరం నాయకుడు.. కేంద్ర కమిటీ సభ్యుడు మాచర్ల ఏసోబు అలియాన్ జగన్ ఊరఫ్ రణదేవ్ దాదా ఛత్తీస్ గఢ్ అడవుల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో మృతి చెందారు.

రణ్ దేవ్ దాదా కేంద్ర మిలటరీ ఫోర్స్ ఇంఛార్జీగా పార్టీ కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. మహారాష్ట్ర -  చత్తీస్ గఢ్ బార్డర్ ఇంఛార్జి అయిన రణ దేవ్ బాబాను ఎదురు కాల్పుల్లో హతమార్చినట్టు దంతెవాడ పోలీసులు ధృవీకరించారు. రణదేవ్ బాబా స్వస్థలం హన్మకొండ జిల్లా కాజీపేట మండలం టేకుల గూడ గ్రామం అని పోలీసులు తెలిపారు.

newsline-whatsapp-channel
Tags : fire police national maoists latest-news news-updates telugu-news

Related Articles