Flood victims:వరద బాధితులకు ఏ ఏ స్టార్ ఎంతిచ్చారంటే.?

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత నాలుగు రోజుల నుంచి కురిసిన వర్షాలకు,  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఊళ్లకు ఊళ్ళు మునిగిపోయాయి. దీంతో చాలామంది ప్రజలు


Published Sep 04, 2024 06:33:04 AM
postImages/2024-09-04/1725446152_mahesh.jpg

న్యూస్ లైన్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత నాలుగు రోజుల నుంచి కురిసిన వర్షాలకు,  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఊళ్లకు ఊళ్ళు మునిగిపోయాయి. దీంతో చాలామంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఇదే తరుణంలో   రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో సహాయ కార్యక్రమాలు చేపడుతుంది.  దీంతో వారందరికీ సహకారం అందించడం సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖులంతా  ముందుకొచ్చారు. దీంతో  వరద బాధితులకు వారి సహకారం అందిస్తున్నారు.

ఇదే తరుణంలో జూనియర్ ఎన్టీఆర్ తెలంగాణకు 50 లక్షలు, ఆంధ్రప్రదేశ్ కు 50 లక్షలు విరాళామందించారు. అంతేకాకుండా మహేష్ బాబు కూడా తెలంగాణకు 50 లక్షలు ఆంధ్రప్రదేశ్ 50 లక్షల అందించారు. చిరంజీవి తెలంగాణకు 50 ఆంధ్రకు 50 లక్షల  విరాళం  అందించారు. అలాగే అల్లు అర్జున్ కూడా రెండు రాష్ట్రాలకు చెరో 50 లక్షలు విరాళం అందించారు. ప్రభాస్ ఆంధ్రప్రదేశ్ కోటి తెలంగాణకు కోటి రూపాయలు అందించారు. అశ్విని దత్తు 25 ఆంధ్రప్రదేశ్ కు అందించారు.

సిద్దు జొన్నలగడ్డ తెలంగాణకు  15 లక్షలు ఆంధ్రప్రదేశ్ 15 లక్షలు  అందించారు. విశ్వక్ సేన్ 5 లక్షలు ఆంధ్రప్రదేశ్ కు అందించారు. అనన్య నాగళ్ళ 2.5 లక్షలు ఆంధ్రప్రదేశ్ కు, 2.5 లక్షలు తెలంగాణకు విరాళంగా అందించారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కోటి, తెలంగాణ రాష్ట్రానికి కోటి విరాళం ప్రకటించారు. ఇక ఇవే కాకుండా  నిర్మాతలు రాధాకృష్ణ నాగవంశీలతో కలిసి  త్రివిక్రమ్ రెండు తెలుగు రాష్ట్రాలకు  చెరో 25 లక్షలు అందించారు. అంతేకాకుండా హీరో బాలకృష్ణ తెలంగాణకు 50 లక్షలు ఆంధ్రప్రదేశ్ 50 లక్షలు సాయం అందించారు. అంతేకాకుండా  అక్కినేని ఫ్యామిలీకి చెందిన నాగార్జున, నాగచైతన్య, అఖిల్ కలిసి తెలంగాణకు 50 లక్షలు, ఆంధ్రప్రదేశ్ 50 లక్షలు సాయం అందించారు.

newsline-whatsapp-channel
Tags : chiranjeevi prabhas news-line jr-ntr balakrishna maheshbabu floods

Related Articles