Husband: భార్య‌ను చిత్రహింసలు పెట్టి చంపిన భర్త

తన పిల్లలను బ్రతకనివ్వడని, తన ఇద్దరు పిల్లలకు రక్షణ కల్పించి న్యాయం చెయ్యండి అంటూ మృతురాలు ఆడియో రికార్డ్‌లో ఆవేదన వ్యక్తం చేసింది.


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-02/1719908533_killshusband.avif

న్యూస్ లైన్ డెస్క్: ఓ భర్త తన భార్యకు పురుగుల మందు తాగించి, చిత్రహింసలకు గురిచేసి ఆత్మహత్యగా చిత్రీకరించేడు. తన పిల్లలను బ్రతకనివ్వడని, తన ఇద్దరు పిల్లలకు రక్షణ కల్పించి న్యాయం చెయ్యండి అంటూ మృతురాలు ఆడియో రికార్డ్‌లో ఆవేదన వ్యక్తం చేసింది. కాగా, ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే విశాఖలోని గాజువాకలో ఉండే భార్యా భర్తలు పద్మిని, సోమేశ్వరరావు తొలుత భర్త బాగానే ఉన్నా ఆ తర్వాత అదనపు కట్నం తీసుకురావాలంటూ వేధించడం మొదలు పెట్టాడు. అత్తామమలు వీరికి తోడయ్యారు. దాంతో తీసుకురాలేనని పద్మిని చెప్పడంతో చంపేయాలనుకున్నారు. ఆమెను బంధించి పద్మిని మామ నోట్లో పురుగుల మందు పోశాడు. ఆమె భర్త ఆ మందు కక్కకుండా నోటికీ చేతిని అడ్డుపెట్టుపెట్టాడు. బలవంతంగా పురుగులు మందు తాగించారు. దీంతో ఆమెకు వాంతులయ్యాయి. ఇరుగు పొరుగు చూసి ఆసుపత్రికి తీసుకెళ్లాలని చెప్పడంతో ఏం తెలియనట్లుగా కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. ఈ దాంతా ఆడియో రికార్డు చేసి మేనమామకు, బంధువులకు పంపింది. చివరకు ఆమె చికిత్స పొందుతూ చనిపోయింది. ఆడియో రికార్డు విన్న బంధువులు కన్నీరు మున్నీరు అయ్యారు. దాంతో కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో భర్త సోమేశ్వరరావు, బాధితురాలి అత్తామామల్ని గాజువాక పోలీసులు అరెస్టు చేశారు. 

newsline-whatsapp-channel
Tags : telangana kill

Related Articles