T20: టాస్ గెలిచిన భారత్.. సఫారీతో ఫైట్

చెపాక్ స్టేడియం వేదికగా జరుగుతున్న మొదటి టీ20 మ్యాచ్‌లో టీమిండియా సారథి హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ బౌలింగ్ ఎంచుకుంది.


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-05/1720185688_smriti.jpg

న్యూస్ లైన్ స్పోర్ట్స్: సొంత గడ్డపై సౌతాఫ్రికాతో జరిగిన వన్డే, టెస్టు సిరీస్‌లను గెలిచి టీమిండియా మహిళల జట్టు టీ20 సిరీస్‌లో తలపడుతుంది. భారత్ వర్సెస్ సఫారీ జట్ల మధ్య చెపాక్ స్టేడియం వేదికగా జరుగుతున్న మొదటి టీ20 మ్యాచ్‌లో టీమిండియా సారథి హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ బౌలింగ్ ఎంచుకుంది. టెస్టు, వన్డే సిరీస్‌లను కొల్పోయిన దక్షిణాఫ్రికా టీ20 ఫార్మాట్‌లో అయినా భారత్‌‌కు గట్టిపోటీనిచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో అన్నరీ డెర్క్‌సెన్, ఎలిజ్-మారీ మార్క్స్, సినాలో జాఫ్తా వంటి సినీయర్ ప్లేయర్స్‌తో ఈ మ్యాచ్‌లో బరిలో దిగుతుంది. 


భారత జట్టు: షఫాలీ వర్మ, స్మృతి మంధాన, దయాళన్ హేమలత, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్(సి), రిచా ఘోష్(w), దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్, ఆశా శోభన, రేణుకా ఠాకూర్ సింగ్.

సౌతాఫ్రికా జట్టు: లారా వోల్వార్డ్ట్(సి), తజ్మిన్ బ్రిట్స్, మారిజాన్ కాప్, అన్నెకే బాష్, క్లో ట్రయాన్, నాడిన్ డి క్లెర్క్, అన్నరీ డెర్క్‌సెన్, ఎలిజ్-మారీ మార్క్స్, సినాలో జాఫ్తా(w), అయాబొంగా ఖాకా, నోంకులులేకో మ్లాబా.
 

newsline-whatsapp-channel
Tags : telangana south-africa india

Related Articles