Chandramohan:చంద్రమోహన్ అంత పిసినారా..పక్కింటికి వెళ్లి పిల్లలు టీవీ చూసేవారా.?

దివంగత నటుడు చంద్రమోహన్ అంటే తెలియని వారు ఉండరు. కొన్ని దశాబ్దాల పాటు వెండితెరను ఏలిన నటుడు అని చెప్పవచ్చు.  అలాంటి చంద్రమోహన్ హీరోగా కూడా చాలా సినిమాల్లో నటించారు


Published Sep 02, 2024 07:35:17 PM
postImages/2024-09-02/1725285917_chnadramohan123.jpg

న్యూస్ లైన్ డెస్క్: దివంగత నటుడు చంద్రమోహన్ అంటే తెలియని వారు ఉండరు. కొన్ని దశాబ్దాల పాటు వెండితెరను ఏలిన నటుడు అని చెప్పవచ్చు.  అలాంటి చంద్రమోహన్ హీరోగా కూడా చాలా సినిమాల్లో నటించారు. కానీ కాస్త హైట్ తక్కువగా ఉండటంవల్ల ఆయనకు హీరోగా కంటే ఎక్కువగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే  అనేక సినిమాల్లో ఛాన్స్ వచ్చింది. అలా ఇండస్ట్రీలో పెద్ద పెద్ద స్టార్ హీరోలు అందరితో ఆయన నటించారు.  అలాంటి చంద్రమోహన్ ఇండస్ట్రీలోకి ఎంతో కష్టపడి వచ్చి ఓ స్థాయికి ఎదిగారు. కానీ ఆయన ఎంత ఎదిగిన పిసినారితనం మాత్రం మెయిన్ టైన్ చేశారని ఒక విమర్శ చాలా రోజుల నుంచి ఉంది. మరి నిజంగానే చంద్రమోహన్ పిసినారా.. అలా ఎందుకు చేసేవారు..

 మరి ఈ విషయాలపై తన భార్య జలంధర ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది.. ఇంతకీ ఆమె ఏమన్నదయ్య అంటే..  అసలు చంద్రమోహన్ అనే వ్యక్తి పిసినారి కాదు ఆయన చిన్నతనం నుంచి ఎదుర్కొన్న పరిస్థితుల కారణంగా ఖర్చులో చాలా వెనకాడే వారు. అనవసర ఖర్చులు అస్సలు పెట్టేవారు కాదు. మనకు ఏది ముఖ్యమో అది మాత్రమే కొనేవారు.  అలా ఇంట్లో కొన్నేళ్లపాటు టీవీ లేకపోవడంతో పిల్లలు పక్కింటికి వెళ్లి మరి టీవీ చూసేవారు. దీంతో పక్కింటి వారు కూడా  అంత పెద్ద నటుడు టీవీ కొనలేదు పిసినారి అంటూ అనేవారు. అంతేకాదు ఫ్రిడ్జ్ కొనడానికి కూడా కొన్ని ఏళ్లు పట్టిందని తెలియజేసింది.

అంతేకాదు ఆయన ఓసారి  కారు కొన్న, ఇల్లు కొన్న ఏదైనా ఖరీదైన వస్తువులు కొన్నా కానీ వాటిని మనం అమ్మే పరిస్థితి రాకూడదు, అలా అన్ని విధాల సెట్ అయినప్పుడే మనం ఆ వస్తువులను కొనాలి. ఎందుకంటే సినిమాల్లో అవకాశాలు అనేవి ఎప్పుడు ఉంటాయో, ఎప్పుడు ఊడాతాయో తెలియదు. అందుకే ఆయన ఏదైనా పెద్ద పెద్ద ఖర్చులు చేయాలంటే చాలా భయపడిపోయేవారు.  ఒకానొక టైంలో ఆయన 1500 రూపాయలకే కారును కూడా తాకట్టు పెట్టి పేదవారికి సాయం చేశారని తెలియజేశారు. ఆయన పిసినారితనం చేసింది కూడా ఫ్యామిలీ భవిష్యత్తు కోసమే ఆమె చెప్పుకొచ్చారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu krishna shobanbabu chandramohan jalandara

Related Articles