Paris: పారాలింపిక్స్‌లో శీతల్‌ సత్తా.. కేటీఆర్ అభినందనలు

రెండు చేతులు లేకపోయినప్పటికీ కాళ్ల సహాయంతోనే ఆమె తన టాస్క్ పూర్తి చేసింది. దీంతో ఆమెకి పరులువురు ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు. 


Published Aug 30, 2024 04:41:40 PM
postImages/2024-08-30/1725016300_Sheetaldevi.jpg

న్యూస్ లైన్ డెస్క్: భారత ఆర్చర్ శీతల్ దేవి ఈరోజు తన పారాలింపిక్స్ అరంగేట్రంలోనే ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. ఆమె కొత్త వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనను కూడా సాధించి ర్యాంకింగ్ రౌండ్‌లో 2వ స్థానంలో నిలిచింది. అయితే, రెండు చేతులు లేకపోయినప్పటికీ కాళ్ల సహాయంతోనే ఆమె తన టాస్క్ పూర్తి చేసింది. దీంతో ఆమెకి పరులువురు ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు. 

తాజాగా, మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఆమెను అభినందించారు. ఆర్చర్ శీతల్ దేవి అద్భుతమైన 703 పాయింట్ల ప్రదర్శనతో ప్యారిస్ పారాలింపిక్స్‌కు చేసిన అద్భుతమైన ప్రయాణం, ఆమె దృఢ సంకల్పం మరియు అభిరుచికి నిదర్శనమని కేటీఆర్ ట్వీట్ చేశారు. రేపు జరగనున్న మ్యాచ్ కోసం ఆమెకు, ఆమె టీంకి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. నిజమైన ఛాంపియన్‌లు ఎప్పుడూ సాకులు చెప్పరని శీతల్‌ నిరూపించిందని ఆయన వెల్లడించారు.  

newsline-whatsapp-channel
Tags : news-line newslinetelugu ktr telanganam paris2024

Related Articles