BRS MLA : హైడ్రాకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాస్ వార్నింగ్


Published Aug 30, 2024 03:13:49 PM
postImages/2024-08-30/1725011029_KukatpallyMLA.jpg

న్యూస్ లైన్ డెస్క్ : హైడ్రా కమిషన్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాస్ వార్నింగ్ ఇచ్చారు. పేదల జోలికి వస్తే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని.. పేదలతో కలిసి ఉద్యమిస్తామని ఆయన అన్నారు. కూకట్ పల్లి సున్నంచెరువు పరిసరాల్లోని పద్మావతి నగర్ కాలనీ వాసులకు హైడ్రా నోటీసులు జారీ చేసింది. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కృష్ణారావు హైడ్రా మీద ఫైర్ అయ్యారు.

వెంటనే పద్మావతి నగర్ వాసులను కలిసి భరోసా ఇచ్చారు. 40 ఏళ్లుగా ఉంటున్న వారికి నోటీసులివ్వడమేంటని ప్రశ్నించారు. కూలీనాలీ చేసుకొని బతికే ప్రజలపై హైడ్రా కొరడా ఝుళిపిస్తామంటే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. ఇప్పటికే కూకట్ పల్లి చెరువులన్నీ సర్వే చేసి కంచెలు వేశామని మాధవరం అన్నారు. హైడ్రా కూల్చివెతల్లో ఇండ్లు కోల్పోయినవారికి డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

newsline-whatsapp-channel
Tags : hyderabad brs kukatpally brsmla latest-news news-updates hydra-commisioner hydra hydra-commissioner-ranganath

Related Articles