Alleti: మూసీని అడ్డం పెట్టుకుని లక్షా 50 వేల కోట్లు స్కామ్

మూసీ నదిని అడ్డం పెట్టుకుని లక్షా 50 వేల కోట్లు ఏటీఎం చేసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.


Published Jul 24, 2024 04:42:25 AM
postImages/2024-07-24/1721813717_alleti2.jpg

న్యూస్ లైన్ డెస్క్: మూసీ నదిని అడ్డం పెట్టుకుని లక్షా 50 వేల కోట్లు ఏటీఎం చేసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ మూసీని అడ్డం పెట్టుకుని ఏటీఎం చేసుకోవాలని చుస్తుందన్నారు. మొదట మూసీ నది ప్రక్షాళన కోసం 30 కోట్లు అవుతుందని అన్నారు. తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 50 కోట్లు అన్నారు. ఆ తర్వాత లక్షా 50 వేల కోట్లు అంటున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ నది వెనుక మతలబు ఏంటో తనకు తెలుసు అని, కాంగ్రెస్ విషపూరిత ఆలోచన చేస్తుందని అన్నారు. ప్రభుత్వం ఖచ్చితంగా ఆస్థాన బుట్టె దారుల కోసం ప్రాజెక్ట్ తయారు చేయడానికి ప్రయత్నం చేస్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి రైతుబంధు వేయడానికి డబ్బులు లేవు అని చెబుతున్నారు. మరి సొంత నియోజకవర్గమైన కొండంగల్‌కు 5 వేల కోట్లు ఎలా ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం రైతులకు రెండు లక్ష రూపాయల రుణమాఫీ చేయాలని మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. 

newsline-whatsapp-channel
Tags : telangana congress bjp maheshwar-reddy

Related Articles