Venu swamy: వేణు స్వామికి నోటీసులు

నాగచైతన్య, శోభిత ఎంతో కాలం కలిసి ఉండరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన చెప్పిన జోతిష్యం వివాదాస్పదమైంది. సోషల్ మీడియాలో కూడా వేణు స్వామి వ్యాఖ్యలపై తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఇది ఇలా ఉంటే వేణు స్వామి భార్య వాణి భర్తను సపోర్ట్ చేస్తూ ఓ వీడియో రిలీజ్ చేసింది. ఇందులో మీడియాపై ఫైర్ అవుతూ, మీడియా ఛానళ్లపై తన కోపాన్ని తీర్చుకుంది. దీంతో ఆమెపై కూడా నెటిజన్స్ తెగ ఫైర్ అవుతున్నారు. 


Published Aug 13, 2024 07:12:39 AM
postImages/2024-08-13//1723550958_venuswamy.jpeg

న్యూస్ లైన్ డెస్క్: ప్రముఖ జోతిష్యుడు వేణు స్వామికి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. నాగచైతన్య, శోభిత విడిపోతారంటూ వేణుస్వామి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. దీంతో ఈ మధ్య తరచుగా ఆయన వార్తల్లో నిలుస్తున్నారు. గతంలో హీరో నాగచైతన్య, నటి సమంత పెళ్లి చేసుకున్న సమయంలో కూడా ఆయన జాతకం అంటూ పలు వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే నాగచైతన్య, సమంత విడిపోనున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, ఆయన చెప్పినట్లుగానే చై-సామ్ జంట విడిపోయింది.  

ఇక నాగచైతన్య ఇటీవల శోభిత ధూళిపాళతో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, వీరిపై కూడా వేణు స్వామి జాతకం చెప్పారు. నాగచైతన్య, శోభిత ఎంతో కాలం కలిసి ఉండరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన చెప్పిన జోతిష్యం వివాదాస్పదమైంది. సోషల్ మీడియాలో కూడా వేణు స్వామి వ్యాఖ్యలపై తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఇది ఇలా ఉంటే వేణు స్వామి భార్య వాణి భర్తను సపోర్ట్ చేస్తూ ఓ వీడియో రిలీజ్ చేసింది. ఇందులో మీడియాపై ఫైర్ అవుతూ, మీడియా ఛానళ్లపై తన కోపాన్ని తీర్చుకుంది. దీంతో ఆమెపై కూడా నెటిజన్స్ తెగ ఫైర్ అవుతున్నారు. 

ఈ క్రమంలోనే వేణు స్వామిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ టీఎఫ్‌జేఏ మహిళా కమిషన్‌ను ఆశ్రయించింది. తాజాగా, టీఎఫ్‌జేఏ ఫిర్యాదును పరిశీలించిన మహిళా కమిషన్‌.. వేణు స్వామికి నోటీసులు పంపించినట్లు తెలుస్తోంది. ఈనెల 22న మహిళా కమిషన్‌ ముందు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. 

newsline-whatsapp-channel
Tags : telangana news-line telanganam venuswamy

Related Articles