Politics: సవాల్ స్వీకరించిన పాడి కౌశిక్ రెడ్డి

పాడి కౌశిక్ రెడ్డి చేసిన అక్రమాలను ఆధారాలతో సహా బయట పెడతానని హెచ్చరించారు. 


Published Jun 25, 2024 11:56:05 AM
postImages/2024-06-25/1719296765_Untitleddesign3.jpg

న్యూస్ లైన్ డెస్క్: కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ వొడితెల ప్రణవ్(Voditela Pranav) విసిరిన సవాల్‌ను హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Padi Koushik reddy) స్వీకరించారు. మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) రూ.100 కోట్ల ఫ్లై యాష్ స్కాం(fly ash scam) చేశారని ఇటీవల పాడి కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తాజగా దీనిపై స్పందించిన వొడితెల ప్రణవ్.. కావాలనే పొన్నం ప్రభాకర్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో BRS అధికారంలో ఉన్న సమయంలో కౌశిక్ రెడ్డి రైస్ మిల్లర్ల నుండి, ఉద్యోగాల పేరిట డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. 

ఇందుకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని వెల్లడించారు. పాడి కౌశిక్ రెడ్డి చేసిన అక్రమాలను ఆధారాలతో సహా బయట పెడతానని హెచ్చరించారు. మంగళవారం హుజురాబాద్‌లోని చేల్పూర్ హనుమాన్ టెంపుల్ వద్దకు పాడి కౌశిక్ రెడ్డి వస్తే ఆధారాలతో సహా నిరూపిస్తానని ప్రణవ్ సవాల్ విసిరారు. ఆయన వ్యాఖ్యలపై స్పందించిన కౌశిక్ రెడ్డి సవాల్ స్వీకరిస్తున్నట్లు స్పష్టం చేశారు. హుజురాబాద్ ప్రజలకు తన నిజాయితీ నిరూపించుకోవడానికి హనుమాన్ టెంపుల్ వద్దకు వస్తానని వెల్లడించారు. 

newsline-whatsapp-channel
Tags : kcr ts-news newslinetelugu congress telanganam paadi-koushik-reddy padi-koushik-reddy ponnam-prabhakar voditela-pranav huzurabad

Related Articles