Anchor: సుమను నమ్మి మోసపోయాం.. బాధితుల ఆవేదన

టాలీవుడ్ యాంకర్ సమను నమ్మి బాధితులు మోసపోయారు.


Published Aug 07, 2024 07:49:02 AM
postImages/2024-08-06/1722953647_anchor.jfif

న్యూస్ లైన్ సినిమా: టాలీవుడ్ యాంకర్ సుమను నమ్మి  ఫ్లాట్లు కొని మోసపోయామని రాకీ ఎవెన్యూస్ బాధితులు రోడ్డెక్కారు. రాకీ ఎవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యాజమాన్యం చేయించిన యాడ్ లో యాంకర్ సుమ నటించింది. సుమ యాడ్ లో నటించడం చూసి.. నిజమే అని నమ్మిన పలువురు వారు దాచుకున్న డబ్బులతో, కొంతమంది బ్యాంకు లోన్లు తీసుకొని మరీ రాకీ ఎవెన్యూస్ లో ఫ్లాట్లు కొన్నారు. కాాగా.. డబ్బులు కట్టిన తర్వాత ఫ్లాట్లు కేటాయించకపోవడంతో ఇందేంటని ప్రశ్నిస్తే బోర్డు తిప్పేశారు. దీంతో.. మోసపోయామని తెలుసుకున్న బాధితులు రోడ్డెక్కారు. 

యాంకర్ సుమ చెబితేనే రాకీ అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో ఇల్లు కొన్నామని బాధితులు తెలిపారు. రూ.26 లక్షలు పెట్టి త్రిబుల్ బెడ్ రూమ్ ఇల్లు కొని మోసపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని, యాంకర్ సుమ కూడా దీనిపై స్పందించాలని బాధితులు డిమాండ్ చేశారు. కంపెనీ యాజమాన్యం నుంచి తమ డబ్బును పోలీసులు రికవరీ చేసి ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు.

newsline-whatsapp-channel
Tags : village-people- tollywood anchor home-remedy suma-kanakala

Related Articles