Teacher : తొమ్మిదో తరగతి బాలికల ప్రైవేట్ పార్ట్స్ తాకుతూ.. కీచక టీచర్ రాందాస్

విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయుడే రాక్షసుడిలా ప్రవర్తించాడు. చదువు నేర్చుకోవడానికి వచ్చిన విద్యార్థినుల పట్ల టీచరే కీచకుడిలా మారిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగులోకి వచ్చింది.


Published Jul 30, 2024 05:10:26 AM
postImages/2024-07-30/1722334156_Illandu.jpg

న్యూస్ లైన్ డెస్క్ : విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయుడే రాక్షసుడిలా ప్రవర్తించాడు. చదువు నేర్చుకోవడానికి వచ్చిన విద్యార్థినుల పట్ల టీచరే కీచకుడిలా మారిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగులోకి వచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో ఈ ఘటన జరిగింది. తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థినులతో ఉపాధ్యాయుడు రాందాస్ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. ఫిజిక్స్ బోధించే రాందాస్ సార్.. తమ శరీరంలోని ప్రైవేట్ భాగాలను తడుముతున్నాడంటూ విద్యార్థినులు తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో.. పాఠశాలకు చేరుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుడు రాందాస్ కి దేహశుద్ధి చేశారు.

సమాచారం అందుకున్న పోలీసులు పాఠశాలకు చేరుకొని రాందాస్ ని అదుపులోకి తీసుకున్నారు. గతంలోనూ ఇలాగే రాందాస్ మీద లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కున్నాడు. కాగా.. ఈ ఘటనపై గిరిజన విద్యాశాఖ దర్యాప్తునకు ఆదేశాలిచ్చింది. మరోవైపు రాందాస్ ని విధుల నుంచి తొలగించాలని.. శిక్ష వేసి వదిలేస్తే కొంతకాలం తర్వాత మరో ప్రాంతంలో ఇలాగే చేస్తాడని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

newsline-whatsapp-channel
Tags : telangana ts-news newslinetelugu crime- latest-news

Related Articles