ABVP: ఏబీవీపీ నాయకులపై పోలీసుల దాడి

దీంతో వారిని పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రంమలోనే పోలీసులు, విద్యార్థి సంఘాల నాయకుల మధ్య తోపులాట జరిగింది. 


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-06-28/1719562068_XXXXXXXSEFGB.jpg

న్యూస్ లైన్ డెస్క్: ఏబీవీపీ విద్యార్థి సంఘాల నాయకులపై పోలీసులు దాడికి పాల్పడ్డారు. సంవత్సరాలు తరబడి ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. లకడికపూల్ లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయాన్ని ఏబీవీపీ నాయకులు ముట్టడించారు. 

తమ డిమాండ్లను నెరవేర్చాలని నినాదాలు చేస్తూ కార్యాలయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రంమలోనే పోలీసులు, విద్యార్థి సంఘాల నాయకుల మధ్య తోపులాట జరిగింది. 

అయినప్పటికీ విద్యార్థి సంఘాలు వెనక్కి తగ్గకపోవడంతో ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల ఝాన్సీతో పాటు పలువురు నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. కార్పొరేట్, ప్రవేటు పాఠశాలలు లక్షల రూపాయలు ఫీజులు దండుకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఏబీవీపీ సంఘం నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

newsline-whatsapp-channel
Tags : ts-news newslinetelugu telanganam abvp akdikapul private-schools government-schools

Related Articles