RASHMIKA: రష్మిక మందన్నాకి యాక్సిడెంట్ ..ఇప్పుడెలా ఉందంటే ?

రష్మిక నెల రోజులకుపైగా సోషల్‌ మీడియాకి దూరంగా ఉంది. భారీ ప్రాజెక్ట్స్ తో బిజీ గా ఉందేమో అనుకుంటే ...కాదట యాక్సిడెంట్ అయ్యిందని చెప్పింది రష్మిక.


Published Sep 10, 2024 06:24:00 AM
postImages/2024-09-10/1725929708_Screenshot20240910062209.png

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: రష్మిక మందన్నాకి ప్రమాదం జరిగిందట. ఇది ఎవరో చెప్పింది కాదు ..నేషనల్ క్రష్ తనసోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది.  విషయం చెబుతూ ఎమోషనల్‌ నోట్‌ కూడా రాసింది. ఎప్పుడు సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉండే రష్మిక నెల రోజులకుపైగా సోషల్‌ మీడియాకి దూరంగా ఉంది. భారీ ప్రాజెక్ట్స్ తో బిజీ గా ఉందేమో అనుకుంటే ...కాదట యాక్సిడెంట్ అయ్యిందని చెప్పింది రష్మిక.


గత నెలలో నేను పెద్దగా యాక్టివ్‌గా ఉండకపోవడానికి కారణం నాకు చిన్న ప్రమాదం జరిగింది(మైనర్‌). ఇప్పుడు నేను దాన్నుంచి కోలుకుంటున్నాను. డాక్టర్లు చెప్పినట్టుగానే ఇంట్లోనే ఉన్నాను. ఇఫ్పుడు కాస్త బెటర్ గా ఉన్నాను. అంటూ పోస్ట్ చేసింది.


మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రయారిటీ ఇవ్వండి.  ఎందుకంటే జీవితం చాలా చిన్నది. మనకు రేపు ఉందో లేదో తెలియదు. కాబట్టి ప్రతి రోజూ ఆనందంగా ఉండండి` అని పేర్కొంది రష్మిక మందన్నా. ప్రస్తుతానికి అమ్మడు పోస్ట్ ఫుల్ వైరల్ అవుతుంది. ఏం జరిగిందో చెప్పలేదు కాని ప్రమాదం నుంచి తప్పించుకున్నానని మాత్రం చెప్పింది.


`పుష్ప 2`లో నటిస్తున్న విషయం తెలిసిందే. బన్నీ హీరోగా సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ దశలోనే ఉంది. ఇది డిసెంబర్‌లో రాబోతుంది. దీంతో పాటు `రెయిన్‌బో` అనే బైలింగ్వల్‌ ఫీమేల్ ఓరియెంటెడ్‌ మూవీ ఆగిపోయిందట. అలాగే `కుబేర` చిత్రంలో హీరోయిన్‌గా చేస్తుంది. హిందీలో సల్మాన్‌ ఖాన్‌తో `సికందర్` చిత్రంలో నటిస్తుంది. తన ఖాతాలో ఇంకా ఎన్నో భారీ మూవీస్ ఉన్నాయి. పుష్ప 2 , గర్ల్ ఫ్రెండ్ మూవీస్ కూడా ఉన్నాయి.
 

newsline-whatsapp-channel
Tags : movie-news social-media rashmika-mandanna

Related Articles