collapse: ప్రైవేట్ స్కూల్లో కూలిన పైకప్పు

కాంక్రీట్ శిధిలాలు పడడంతో 9 మంది విద్యార్థులు గాయపడినట్లు  తెలుస్తోంది. ఈ ఘటనలో ఒక సిబ్బంది కూడా గాయపడ్డారు. క్షతగాత్రులను హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే పిల్లలకు ప్రమాదం జరిగిందని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


Published Aug 13, 2024 03:33:39 PM
postImages/2024-08-13/1723543419_privateschool.jpg

న్యూస్ లైన్ డెస్క్: క్లాస్ రూంలో విద్యార్థులు ఉండగానే పైకప్పు కోల్పోయింది. నంద్యాల పట్టణంలోని శ్రీసంకల్ప్ పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. తరగతి గదిలో 30 మంది విద్యార్థినులకు పాఠం బోధిస్తుండగా హఠాత్తుగా ప్రమాదం జరిగినట్లు స్కూల్ స్టాఫ్ తెలిపారు. 

కాంక్రీట్ శిథిలాలు పడడంతో 9 మంది విద్యార్థులు గాయపడినట్లు  తెలుస్తోంది. ఈ ఘటనలో ఒక సిబ్బంది కూడా గాయపడ్డారు. క్షతగాత్రులను హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే పిల్లలకు ప్రమాదం జరిగిందని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీలైనంత త్వరగా విచారణ జరిపి స్కూల్ ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

newsline-whatsapp-channel
Tags : news-line newslinetelugu telanganam private-schools slab-collapse nandyal

Related Articles