Congress: ఈనెల 24న రాష్ట్రానికి సోనియా, రాహుల్ గాంధీ

ఈ నెల 24న రాష్ట్రానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ రానున్నారు.


Published Aug 16, 2024 06:34:37 PM
postImages/2024-08-16/1723813477_sonia.PNG

న్యూస్ లైన్ డెస్క్: ఈ నెల 24న రాష్ట్రానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ రానున్నారు. సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాజీవ్ గాంధీ విగ్రహ ప్రాంగణాన్ని మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తదితరులు పరిశీలించారు. ఈ నెల 20వ తేది మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా సచివాలయం ముందు ఏర్పాటు చేస్తున్న రాజీవ గాంధీ విగ్రహావిష్కరణ ఉండడంతో మంత్రులు పనులను పరిశీలించారు.

సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ కోసం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ రాష్ట్రానికి రానున్నట్లు మంత్రులు తెలిపారు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని  సోనియా గాంధీ ఆవిష్కరించినున్నారు. అయితే అదే రోజు వరంగల్‌లో కాంగ్రెస్ రైతు కృతజ్ఞత సభ జరగనుంది. ఈ సభలో రైతలకు రెండు లక్షల రుణమాఫీ చేసిన సందర్భంగా రాహుల్ గాంధీ రైతులతో సమావేశం అవుతున్నారు. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు పాల్గొనున్నారు.
 

newsline-whatsapp-channel
Tags : telangana congress cm-revanth-reddy rahul-gandhi rajeev-gandhi

Related Articles