Sraddha Kapoor : ఆ విషయంలో పీఎం మోడీని బీట్ చేసిన శ్రద్ధా కపూర్

వరుస సినిమాలతో బాలీవుడ్ లో దుమ్ము రేపుతున్న స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ తన లైఫ్ లోనే అరుదైన మైలురాయిని దాటింది. స్త్రీ-2 సినిమాతో దేశవ్యాప్తంగా క్రేజ్ పెంచుకున్న ఈ భామ ఇన్ స్టాగ్రామ్ లో ప్రధాని నరేంద్ర మోడీని దాటేసింది.


Published Aug 21, 2024 04:58:01 PM
postImages/2024-08-21/1724239681_SradhakapoorBeatsModiInInstaFollowers.jpg

న్యూస్ లైన్ డెస్క్ : వరుస సినిమాలతో బాలీవుడ్ లో దుమ్ము రేపుతున్న స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ తన లైఫ్ లోనే అరుదైన మైలురాయిని దాటింది. స్త్రీ-2 సినిమాతో దేశవ్యాప్తంగా క్రేజ్ పెంచుకున్న ఈ భామ ఇన్ స్టాగ్రామ్ లో ప్రధాని నరేంద్ర మోడీని దాటేసింది. ప్రధాని నరేంద్ర మోడీకి ఇన్ స్టాగ్రామ్ లో 91.3 మిలియన్ల మంది ఫాలోయింగ్ ఉంది. అయితే.. తాజాగా శ్రద్ధా కపూర్ మోడీ కంటే ఎక్కువ మంది ఫాలోవర్లను సంపాదించి ఆయన కంటే ముందు నిలిచింది. మోడీకి 91.3 మిలియన్ల ఫాలోవర్లు ఉంటే.. శ్రద్ధా కపూర్ కి 91.5 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.

తన జీవితానికి సంబంధించిన అన్ని విషయాలను, తన అభిరుచులను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంటూ నిత్యం ఫాలోవర్లు, ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటుంది. రీసెంట్ గా రిలీజైన స్త్రీ-2 మూవీకి భారీ కలెక్షన్లు వస్తుండటంతో  ఫాలోవర్ల సంఖ్య ఇంకా పెరుగుతోంది. అయితే.. ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్ల విషయంలో అందరి కంటే టాప్ లో విరాట్ కోహ్లీ ఉన్నాడు. విరాట్ కి 271 మిలియన్ల మంది ఇన్ స్టా ఫాలోవర్లు ఉన్నారు. ప్రియాంక చోప్రాకు 91.8 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి 26.7 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. అయితే.. రాజకీయ నాయకుల్లో ప్రపంచంలో అందరి కంటే ఎక్కువ మోడీకే ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారు. కాగా.. తాజాగా శ్రద్ధా కపూర్ ఇన్ స్టాలో మోడీని దాటేసి వార్తల్లో నిలిచింది.

newsline-whatsapp-channel
Tags : rahul-gandhi movie-news narendra-modi rahul-modi bollywood- pm-modi bolly-wood virat-kohli latest-news news-updates

Related Articles