Sri Reddy: 'సన్నాసి ఎదవ' అంటూ పవన్ పై రెచ్చిపోయిన శ్రీ రెడ్డి.?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తిరుమల లడ్డు వివాదంపై ఎంత ఫైర్ అయ్యారో చెప్పనక్కర్లేదు. అంతేకాదు ఈ విషయంలో ప్రకాష్ రాజ్ కార్తీలపై కూడా మండిపడ్డారు. అయితే హిందుత్వం, సనాతన ధర్మం అంటూ పవన్ కళ్యాణ్ పెద్దపెద్ద


Published Sep 25, 2024 02:36:16 PM
postImages/2024-09-25/1727255176_pawansrireddy.jpg

న్యూస్ లైన్ డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తిరుమల లడ్డు వివాదంపై ఎంత ఫైర్ అయ్యారో చెప్పనక్కర్లేదు. అంతేకాదు ఈ విషయంలో ప్రకాష్ రాజ్ కార్తీలపై కూడా మండిపడ్డారు. అయితే హిందుత్వం, సనాతన ధర్మం అంటూ పవన్ కళ్యాణ్ పెద్దపెద్ద డైలాగులు కొట్టారు. అయితే ఈయనపై మెజారిటీ సభ్యులు ఫైర్ అవుతున్నారు.  

ఈ నేపథ్యంలోనే మెగా ఫ్యామిలీ పై ఎప్పుడు విరుచుకు పడే శ్రీరెడ్డి కూడా నోరు విప్పింది.శ్రీరెడ్డి తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పవన్ కళ్యాణ్ పై ఈ విధంగా పోస్ట్ పెట్టింది.. హిందూ ధర్మం అని చెప్పుకు తిరిగే ఎదవ హిందూ ధర్మాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేస్తున్నావా.. మరి నువ్వు ఎందుకు క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావ్..

అప్పుడు నీ సనాతన ధర్మం ఎక్కడికి పోయింది.సంతలోకి  పోయిందా.. సనాతన ధర్మం, కమ్యూనిస్టు భావాలు అంటూ నువ్వు మాట్లాడే ఒక్క మాట అయినా మ్యాచ్ అయిందా సన్నాసి.. అయినా దీపంలో సిగరెట్ వెలిగించుకునే వాడికి పుట్టినోడా..దీక్ష చేస్తూ చెప్పులు వేసుకునేవాడా..ముసలి నక్క.. ఇంకొకసారి హిందుత్వం,సనాతన ధర్మం అంటే గరుడ పురాణం పంపిస్తా అంటూ సంచలన పోస్ట్ పెట్టింది శ్రీ రెడ్డి.

అయితే ఈ పోస్టులో పవన్ కళ్యాణ్ పేరు ఎక్కడ వాడకపోయినప్పటికీ ఈ పోస్ట్ చూస్తే మాత్రం శ్రీరెడ్డి పరోక్షంగా పవన్ కళ్యాణ్ పై కామెంట్స్ చేసింది అనుకోవడంలో ఎలాంటి అనుమానం లేదు. ప్రస్తుతం శ్రీరెడ్డి పెట్టిన పోస్ట్ పై చాలామంది పవన్ కళ్యాణ్ అభిమానులు మండిపడుతున్నారు

newsline-whatsapp-channel
Tags : janasena news-line pawan-kalyan anna-leznova sri-reddy hero-karthi

Related Articles