India vs Srilanka: భారత్‌పై శ్రీలంక విజయం.. సిరీస్ కైవసం

భారత్, శ్రీలంక జట్లు మధ్య బుధవారం ప్రేమదాస స్టేడియం వేదికగా జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో లంక విజయం సాధించింది.


Published Aug 07, 2024 08:44:58 PM
postImages/2024-08-07/1723043698_lanka2.PNG

న్యూస్ లైన్ సోర్ట్స్: భారత్, శ్రీలంక జట్లు మధ్య బుధవారం ప్రేమదాస స్టేడియం వేదికగా జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో లంక విజయం సాధించింది. అవిష్క ఫెర్నాండో(96), కుసల్ మెండిస్(59) హాఫ్ సెంచరీలతో చెలరేగగా.. పాతుమ్ నిస్సాంక(45) పరుగులతో రాణించాడు. దీంతో శ్రీలంక, టీమిండియా జట్టుపై 110 పరుగుల తేడాతో విక్టరీ కొట్టింది. ఈ విజయంతో లంక వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది.

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక జట్టుకు మంచి ఆరంభం లభించింది. ఓపెనర్లు పాతుమ్ నిస్సాంక, అవిష్క ఫెర్నాండో ఇద్దరూ దూకుడు బ్యాటింగ్ చేస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. బౌండరీలు, సిక్సర్లు బాదుతూ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడారు. లంక స్కోర్ బోర్డుకు 90 పరుగులు జతచేశారు. అయితే ఈ జోడిని అక్షర్ పటేల్ బ్రేక్ చేశాడు. అవిష్క ఫెర్నాండో(45)ను ఒక చక్కని బంతితో బోల్తా కొట్టించాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కుసల్ మెండిస్ సూపర్ బ్యాటింగ్ చేశాడు. వీళ్లిందరూ కలిసి మంచి ఇన్నింగ్స్ ఆడారు. ఇక మరో ఎండ్‌లో ఫెర్నాండో తుఫాన్ బ్యాటింగ్ చేశాడు. బౌండరీలు, సిక్సర్లు కొడుతూ (102 బంతుల్లో 96 పరుగులు 9 ఫోర్లు, 2 సిక్సర్ల)తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే ఫెర్నాండో(96), రియాన్ పరాగ్ బౌలింగ్‌లో భారీ ష్టార్ట్ ఆడే ప్రయత్నంలో బౌండరీ వద్ద క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన సదీర సమరవిక్రమ(0), చరిత్ అసలంక(10), జనిత్ లియానాగే(8) వరుసగా విఫలమైయ్యారు. దీంతో ఐదు వికెట్లు కోల్పోయి 180 రన్స్ కొట్టింది. ఓవైపు వికెట్లు పడుతున్న భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ కుసల్ మెండిస్ ధనాధన బ్యాటింగ్ చేశాడు. దీంతో కుసల్( 82 బంతుల్లో 59 రన్స్ 4 ఫోర్ల)తో ఫిఫ్టి పూర్తి చేసుకున్నాడు. మరో బ్యాటర్  కమిందు మెండిస్(23 నటౌట్) కూడా మెరుపు బ్యాటింగ్‌తో చెలరేగాడు. దీంతో శ్రీలంక జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. భారత బౌలర్లు రియాన్ పరాగ్ మూడు వికెట్లు పడగొట్టాగా.. వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్ తలా వికెట్ల తీశారు. 


249 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన టీమిండియా జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ శుభమన్ గిల్(6)ను అసిత ఫెర్నాండో క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన రిషబ్ పంత్(6) కూడా పెవిలియన్‌కు చేరాడు. ఇక రోహిత్ శర్మ దూకుడు బ్యాటింగ్ చేస్తూ లంక బౌలర్లకు చుక్కలు చూపించాడు. అయితే(35), దునిత్ వెల్లలాగే బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఈ కాసేపటీకే విరాట్(20) కూడా పెవిలియన్ బాట పట్టాడు. దీంతో టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయి 70 పరుగులు చేసింది. తర్వాత క్రీజులో దిగిన అక్షర్ పటేల్, శ్రేయస్ అయ్యారు కూడా నిరాశ పరిచారు. దీంతో భారత్ పీకలోతు కష్టాల వెళ్లింది. ఈ సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన రియాన్ పరాగ్, శివం దూబే టీమిండియాను అదుకున్నారు. ఇద్దరూ ధనాధన బ్యాటింగ్ చేస్తూ స్టేడియంలో పరుగుల వరద పారించారు. కానీ జెఫ్రీ వాండర్సే పరాగ్(15), దూబే(9) లను వెనక్కి పంపాడు. దీంతో భారత్ 8 వికెట్లు కోల్పోయింది. చివరిలో వాషింగ్టన్ సుందర్(30), కుల్దీప్ యాదవ్(6) పోరాటం చేసిన టార్గెట్‌ను ఛేదించలేకపోయారు. దీంతో శ్రీలంక జట్టు 110 పరుగుల తేడాతో విజయం సాధించింది. లంక బౌలర్లు దునిత్ వెల్లలాగే ఐదు వికెట్లు పడగొట్టాగా.. జెఫ్రీ వాండర్సే, మహేశ్ తీక్షణ రెండు వికెట్లు తీశారు.

newsline-whatsapp-channel
Tags : won-the-match odi-match india cricket-news srilanka

Related Articles