Grandson: డబ్బులివ్వలేదని అమ్మమ్మని చంపిన మనవడు

గంజాయికి డబ్బులివ్వలేదని మనవడు తన అమ్మమ్మని చంపేశాడు.


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-17/1721190962_teen.jfif

న్యూస్ లైన్ డెస్క్: గంజాయికి డబ్బులివ్వలేదని మనవడు తన అమ్మమ్మని చంపేశాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. రోటరీనగర్ కు చెందిన రాంబాయమ్మ(85) తన మనవడు ఉదయ్ ను తన దగ్గరే చిన్నప్పటి నుండి పెంచుకుంది. ఉదయ్ డిప్లొమాలో చేరాక గంజాయికి, మద్యానికి బానిసై తరచూ రాంబాయమ్మను డబ్బుల కోసం వేధిస్తూ, తన పెన్షన్ డబ్బులు కూడా తీసుకుపోయేవాడు. ఇదే క్రమంలో నిన్న రాంబాయమ్మను మళ్లీ డబ్బులు అడగగా, తను లేవనడంతో అమ్మమ్మ మీద దాడికి దిగి తన ఛాతీ, చెవులపై ఉదయ్ పిడిగుద్దులు గుద్దాడు.. చెవుల నుండి రక్తం రావడంతో రాంబాయమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. ఇంత చేసి రాంబాయమ్మ జారి పడింది అని ఉదయ్ 108కి ఫోన్ చేశాడు. అనుమానం వచ్చిన స్థానికులు ఉదయ్ ను దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించడంతో నేరాన్ని అంగీకరించాడు.

newsline-whatsapp-channel
Tags : telangana kill womens

Related Articles