High Court: అత్యాచారం కేసులో దోషికి ఉరిశిక్ష

2018 నార్సింగిలో బాలికపై అత్యాచారం జరిగి హత్యకు గురైన నాలుగున్నరేళ్ల బాలిక కేసుపై తెలంగాణం హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.


Published Jul 31, 2024 07:20:30 AM
postImages/2024-07-31/1722428147_jail.JPG

న్యూస్ లైన్ డెస్క్: 2018 నార్సింగిలో బాలికపై అత్యాచారం జరిగి హత్యకు గురైన నాలుగున్నరేళ్ల బాలిక కేసుపై తెలంగాణం హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. బుధవారం ఈ కేసును విచారణ జరిపిన కోర్టు దోషికి ఉరిశిక్ష విధించింది. నాలుగున్నరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో దోషికి ఉరిశిక్ష పడింది. నార్సింగిలో ఘాతుకానికి పాల్పడ్డ దోషి దినేష్‌కుమార్‌కు ఉరిశిక్ష విధింస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది. బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన సెంట్రింగ్‌ కార్మికుడు దినేష్‌ కుమార్‌‌కు 2021లో రంగారెడ్డి కోర్టు ఉరిశిక్ష విధించింది. అయితే రంగారెడ్డి కోర్టు తీర్పును తెలంగాణ హైకోర్టు సమర్థించింది. 

newsline-whatsapp-channel
Tags : telangana police telanganahighcourt womens

Related Articles