Sajjanar: ఆర్టీసీ ప్రయణికులకు గుడ్ న్యూస్ 

ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్‌ నుంచి విజయవాడ వైపు వెళ్లే ప్రయాణికులకు బంపర్ ఆఫర్‌ ప్రకటించింది.


Published Sep 05, 2024 07:04:43 AM
postImages/2024-09-05/1725500083_bumper.PNG

న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ మొత్తం నీటిలో మునిగిపోయింది. ఏపీ రాష్ట్రంలో మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇక భారీ వర్షాలు, వరదలతో విజయవాడ అతలాకుతలంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్‌ నుంచి విజయవాడ వైపు వెళ్లే ప్రయాణికులకు బంపర్ ఆఫర్‌ ప్రకటించింది. ఈ రూట్‌ బస్సుల్లో రాకపోకలు సాగించే ప్రయాణికులకు టికెట్‌ ధరపై 10 % డిస్కౌంట్ ఇస్తున్నట్లు టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ఒక ప్రకటనలో వెల్లడించారు.

హైదరాబాద్-విజయవాడ మార్గంలో వెళ్లే ప్రయాణికులకు శుభవార్త. ఆ రూట్ లో రాకపోకలు సాగించే వారి కోసం టికెట్ ధరలో 10 శాతం రాయితీని టీజీఎస్‌ఆర్టీసీ కల్పిస్తోంది. రాజధాని ఏసీ, సూపర్ లగ్జరీ బస్సులలో ఈ రాయితీ వర్తిస్తుంది. ఈ డిస్కౌంట్ సదుపాయాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని సంస్థ కోరుతోంది. ముందస్తు రిజర్వేషన్ కోసం https://tgsrtcbus.in ని సంప్రదించండి అని సజ్జనార్ తన పోస్టులో పేర్కొన్నారు. 

newsline-whatsapp-channel
Tags : telangana chandrababu andhrapradesh free-bus-ticket tgsrtc

Related Articles