Warangal : అక్కాతమ్ముళ్లను కలిపిన వరంగల్ పోలీసులు.. రాఖీ కట్టిన అక్క

గొడవపడి పోలీస్ స్టేషన్ కి వచ్చిన అక్కాతమ్ముళ్లను కలిపారు వరంగల్ పోలీసులు. ఒకరి మీద ఒకరు ఫిర్యాదు చేసుకునేందుకు వచ్చిన వారిద్దరి మధ్య సయోధ్య కుదిర్చి రాఖీ కట్టించి మరీ ఇంటికి పంపారు.


Published Aug 19, 2024 03:39:23 PM
postImages/2024-08-19/1724062163_brotherAndsister.jpg

న్యూస్ లైన్ డెస్క్ : గొడవపడి పోలీస్ స్టేషన్ కి వచ్చిన అక్కాతమ్ముళ్లను కలిపారు వరంగల్ పోలీసులు. ఒకరి మీద ఒకరు ఫిర్యాదు చేసుకునేందుకు వచ్చిన వారిద్దరి మధ్య సయోధ్య కుదిర్చి రాఖీ కట్టించి మరీ ఇంటికి పంపారు. వివారాల్లోకి వెళ్తే..

వరంగల్ జిల్లా కరీమాబాద్ లో ఉండే కోటమ్మ, ఆమె తమ్ముడు ఏడుకొండలు మధ్య ఇంటి స్థలం విషయంలో గొడవ జరిగింది. ఈ విషయం గత కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య కొట్లాటలు జరుగుతున్నాయి. చంపేస్తానంటూ ఒకరిని ఒకరు బెదిరించుకున్నారు. దీంతో.. కోటమ్మ తమ్ముడు ఏడు కొండలు మీద ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కి వచ్చింది. ఏడుకొండలును పోలీస్ స్టేషన్ కి పిలిపించిన పోలీసులు ఇద్దరి మధ్య రాజీ కుదిర్చి కోటమ్మతో తమ్ముడు ఏడు కొండలుకి రాఖీ కట్టించి.. మిఠాయి తినిపించి ఇంటికి పంపించారు.

newsline-whatsapp-channel
Tags : viral-news assigned-lands warangal crime latest-news telugu-news

Related Articles