Thief Letter : ఇంట్లో ఏం దొరకలేదని లెటర్ రాసి పెట్టిన దొంగ

ఓ ఇంట్లో దొంగతనం చేసిన దొంగ.. ఎంత వెతికినా ఏం దొరకకపోయే సరికి.. అన్నా.. మీ ఇంట్లో ఏం దొరకలేదు. డోంట్ వర్రీ. మేము ఏం ఎత్తుకుపోలేదు.. అని లెటర్ రాసి మరీ పోయారు.


Published Aug 06, 2024 04:30:01 PM
postImages/2024-08-06/1722942001_thiefletter.jpg

న్యూస్ లైన డెస్క్ : రోజురోజుకు దొంగతనాలు చేయడంలో దొంగలు ఆరితేరుతున్నారు. పోలీసులకు చిక్కకుండా పారిపోతున్న వారు కొందరైతే.. ఇంట్లో ఏం దొరకక ఇంటి యజమానుల మీద నిరసన తెలిపిన వారు కొందరు. కొందరైతే జాలి చూపి మరీ.. ఆ ఇంటివారికి వాళ్ల జేబులోంచే డబ్బులు పెట్టి పోయిన వీడియోలూ రీసెంట్ గా చూశాం. అయితే తాజాగా ఓ ఇంట్లో దొంగతనం చేసిన దొంగ.. ఎంత వెతికినా ఏం దొరకకపోయే సరికి.. అన్నా.. మీ ఇంట్లో ఏం దొరకలేదు. డోంట్ వర్రీ. మేము ఏం ఎత్తుకుపోలేదు.. అని లెటర్ రాసి మరీ పోయారు.

వివరాల్లోకి వెళ్తే.. ఉమ్మడి కర్నూలు జిల్లా నంద్యాల శివారులో చాబోలు గ్రామంలో ఓ అగ్రికల్చర్ ఆఫీసులో చోరీ జరిగింది. ఆఫీసు మెయిన్ డోర్ పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఆపీసులో ఉన్న అన్నీ బీరువాలు, కబోర్డుల్లో తనిఖీ చేశారు. ఎంత వెతికినా ఏం దొరకకపోవడంతో ‘ మీ ఆఫీసులో మాకు ఏమీ దొరకలేదు. డోంట్ వర్రీ బ్రదర్. మేం ఏం తీసుకుపోలేదు’ అంటూ లెటర్ రాసి వెళ్లిపోయారు. ఉదయం ఆఫీసు తెరిచి చూసిన యజమాని ఆఫీసులో దొంగలు పడ్డారని గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. లక్షల విలువ చేసే పరికరాలు, డ్రోన్స్, కంప్యూటర్లు ఏమీ ముట్టుకోలేదు. పైగా ఏం దొరకలేదని లెటర్ కూడా రాసిపెట్టి పోయాడు. ఈ వీడియో ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu crime- crime news-updates telugu-news

Related Articles