రేషన్ కార్డుల జారీపై నేడు తెలంగాణ క్యాబినెట్ భేటీ

కొత్త రేషన్ కార్డుల జారీ, కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు కోసం స్థలాల కేటాయింపుల గురించి నేడు తెలంగాణ క్యాబినెట్ భేటీ కానుంది.


Published Jul 31, 2024 10:50:33 PM
postImages/2024-08-01/1722484219_IMG20240801092003640x400pixel.jpg

న్యూస్ లైన్ డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు రాష్ట్ర క్యాబినెట్ భేటీ కానుంది. నేడు సాయంత్రం జరుగనున్న ఈ మంత్రివర్గ సమావేశంలో కొత్త రేషన్ కార్డుల జారీ అంశాన్ని కీలకంగా చర్చించనున్నారు. రేషన్ కార్డుల జారీ కోసం సబ్ కమిటీని ఏర్పాటు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలు చేస్తోంది.

దాంతో పాటు కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు కోసం స్థలాల కేటాయింపులు, మూసీ అభివృద్ధికి ప్రపంచ బ్యాంకు నిధులు, రిజర్వాయర్లు, చెరువుల పూడిక తీత,బాక్సర్ నిఖత్ జరీన్, క్రికెటర్ మహ్మద్ సిరాజ్ లకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే అంశంపై క్యాబినెట్ చర్చ చేయనుంది.

newsline-whatsapp-channel
Tags : telangana ts-news revanth-reddy news-line cm-revanth-reddy ratinfood latest-news telugu-news

Related Articles