RTC: ప్రైవేటు వాహనాన్ని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు 

హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చెసుకుంది.


Published Sep 05, 2024 08:42:39 AM
postImages/2024-09-05/1725505959_busclash.PNG

న్యూస్ లైన్ డెస్క్: హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చెసుకుంది. బెంగళూరు జాతీయ రహదారి 44 శివరాంపల్లి కూడలి ఆరాంఘర్ వద్ద ఓ ప్రైవేటు వాహనాన్ని ఆర్టీసీ బస్సు అతివేగంగా వచ్చి ఢీకొట్టడంతో ప్రైవేట్ వాహనం ఒకసారిగా భారీ శబ్దంతో బోల్తా కొట్టింది. భారీ వర్షం నేపథ్యంలో ముందు వాహనాలు కనిపించక పోవడంతో ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఒక్కసారిగా వేగంతో వచ్చి ప్రైవేటు వాహనని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా స్థానికులు చెబుతున్నారు. 

ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 
 

newsline-whatsapp-channel
Tags : telangana fire-accident hyderabad congress cm-revanth-reddy ponnam-prabhakar tgsrtc rtcdriver

Related Articles