Singareni : సింగరేణి గనిలో ప్రమాదం.. ఇద్దరు కార్మికులు మృతి

సింగరేణి గనిలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. రామగిరి మండలంలోని ఆర్జీ 3 పరిధిలోని ఓసీపీ2 గనిలో ప్రమాదం చోటు చేసుకుంది.


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-17/1721232671_Singareni.jpg

న్యూస్ లైన్ డెస్క్ : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని ఆర్జీ3 పరిధిలోని ఓసీపీ2 గనిలో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. వాటర్ పైప్ లైన్ కు మరమ్మత్తులు చేస్తుండగా ఒక్కసారిగా మట్టికుప్పలు కూలి కార్మికులపై పడింది. ఆ సమయంలో ఘటనా స్థలంలో మొత్తం నలుగురు కార్మికులు విధుల్లో ఉన్నారు. మట్టిపెళ్లలు కూలి ఇద్దరు కార్మికులు అక్కడిక్కడే చనిపోగా.. మరో ఇద్దరు కార్మికులకు గాయాలయ్యాయి. మృతి చెందిన కార్మికులు నిప్పు వెంకటేశ్వర్లు (ఫిట్టర్), విద్యాసాగర్ (జనరల్ మజ్దూర్) లుగా అధికారులు గుర్తించారు. మృతదేహాలను గోదావరిఖని సింగరేణి హాస్పిటల్ కు తరలించారు. క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. కార్మికుల మృతితో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది.

newsline-whatsapp-channel
Tags : singareni singareni-coal-mines

Related Articles