Water crisis: తాగడానికి నీళ్లు ఇవ్వండి పొంగులేటి సారూ 2024-06-28 17:13:30

న్యూస్ లైన్ డెస్క్: మంత్రి పొంగులేటి సారూ తాగడానికి నీళ్లు ఇవ్వండి అంటూ గ్రామస్తులు రోడ్డెక్కారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజక వర్గం నేలకొండపల్లి మండలం పైనపల్లి గ్రామం తాగు నీరు రావట్లేదని హైవే పై రాస్తారోకో చేసి గ్రామస్తులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. గ్రామంలో 10 రోజుల నుంచి నీళ్లు రావడం లేదని, ఎన్నిసార్లు అధికారులకు చెప్పిన పట్టించుకోవడం లేదని గ్రామస్తులు మండిపడ్డారు. అధికారులు వెంటనే స్పందించి తాగు నీరు అందించాలని డిమాండ్ చేశారు.