Olympics: ప్రపంచ ఛాంపియన్‌ను చిత్తు చేసిన వినేష్

భార‌త స్టార్ రెజ్ల‌ర్ వినేశ్ ఫోగ‌ట్ ఒలింపిక్స్‌ మెగా టోర్నీలో అద‌ర‌గొడుతోంది.


Published Aug 06, 2024 06:13:27 PM
postImages/2024-08-06/1722948207_vinesh.PNG

న్యూస్ లైన్ స్పోర్ట్స్: భార‌త స్టార్ రెజ్ల‌ర్ వినేశ్ ఫోగ‌ట్ ఒలింపిక్స్‌ మెగా టోర్నీలో అద‌ర‌గొడుతోంది. 16వ రౌండ్‌లో ప్రపంచ నంబ‌ర్ 1ను చిత్తుగా ఓడించింది. దీంతో వినేశ్ క్వార్ట‌ర్స్‌లోనూ జోరు చూపించి సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. 50 కిలోల విభాగం క్వార్ట‌ర్ ఫైన‌ల్లో వినేశ్‌ ఉడుం ప‌ట్టుతో ఉక్రెయిన్ రెజ్ల‌ర్ ఒక్సానా లివాచ్‌ను మ‌ట్టిక‌రిపించింది. ఆరంభం నుంచి ప్ర‌త్య‌ర్థిని ముప్ప‌ తిప్ప‌లు పెట్టిన భార‌త రెజ్ల‌ర్ 7-5తో గెలుపొంది సెమీస్‌లో అడుగుపెట్టింది. దాంతో, ఇండియాకు క‌నీసం కాంస్యం ఖ‌రారు చేసింది. ఫైన‌ల్ బెర్తు కోసం ఆమె రాత్రి 10:15 గంట‌ల‌కు త‌ల‌ప‌డ‌నుంది. కాగా, అత్యంత దుర్మార్గపు పాత్ర హత్య ప్రచారానికి గురైన వినేష్ ఎప్పటికీ మర్చిపోవద్దు. శక్తివంతమైన డబ్ల్యూఎఫ్‌ఐకి వ్యతిరేకంగా మహిళా రెజ్లర్ నిరసనలలో ఆమె ప్రధాన వ్యక్తిగా వీధిలో నెలల తరబడి గడిపింది. పోలీసు లాఠీతో ఈడ్చుకెళ్లిన ఇంకా న్యాయం కోసం పోరాడుతున్నారు. కాగా వినేష్ తను భారతీయ మహిళా శక్తిని అని ప్రపంచానికి చాటిచెప్పింది.

newsline-whatsapp-channel
Tags : india parisolympics paris2024

Related Articles