Murder : భర్త హెచ్చరించాడు.. భార్య చంపేసింది.. కారణం తెలిస్తే షాక్

భార్యాభర్తల జంట మధ్య వివాహేతర సంబంధం చిచ్చు పెట్టింది. ప్రియుడి వైపే మొగ్గు చూపిన మహిళ అతడితో కలిసి భర్తను అతి దారుణంగా చంపేసింది.


Published Aug 10, 2024 02:36:00 PM
postImages/2024-08-10/1723280760_murder.jpg

న్యూస్ లైన్ డెస్క్ : చూడముచ్చటగా కలిసి ఉంటున్న ఓ భార్యాభర్తల జంట మధ్య వివాహేతర సంబంధం చిచ్చు పెట్టింది. ప్రియుడి వైపే మొగ్గు చూపిన మహిళ అతడితో కలిసి భర్తను అతి దారుణంగా చంపేసింది. రూ.2 లక్షలు సుపారీ ఇచ్చి భర్తను హత్య చేయించిన ఆమె.. అతడు చనిపోయాడా లేదో అని తెలుసుకునేందుకు గొంతుపై కాలు వేసి తొక్కింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చూడగా.. దారుణమైన విషయాలు బయటపడ్డాయి.

ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా పొదిలికి చెందిన చల్లా నరేంద్ర పదేల్ల క్రితం లక్ష్మీ ప్రియను పెళ్లి చేసుకున్నాడు. పీఎఫ్ డిపార్ట్ మెంట్ లో ఇన్ స్పెక్టర్ గా పని చేస్తున్న నరేంద్ర, లక్ష్మీప్రియలకు ఇద్దరు సంతానం ఉన్నారు. కాగా.. 8 నెలల క్రితం ఎదురింట్లో అద్దెకు దిగిన శశి కుమార్ అనే యువకుడు నరేంద్ర, లక్ష్మ్మీప్రియల సంసారంలో నిప్పులు పోశాడు. లక్ష్మీ ప్రియతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. విషయం తెలిసిన నరేంద్ర పలుమార్లు లక్ష్మీ ప్రియను, శశి కుమార్ ను హెచ్చరించాడు. పద్ధతి మార్చుకోకుంటే చంపేస్తానని బెదిరించాడు. ప్రియుడిని వదులుకునేందుకు ఇష్టపడని లక్ష్మీ ప్రియ ఓ గ్యాంగుకు సుపారీ ఇచ్చి భర్తను లేపేసింది.

భర్త వార్నింగ్ ను సీరియస్ గా తీసుకున్న లక్ష్మీప్రియ నిజంగానే తనను, ప్రియుడిని భర్త చంపేస్తాడేమో అని భావించింది. దీంతో భర్తను చంపేందుకు ప్లాన్ వేసింది. ఇద్దరికి ధైర్యం సరిపోక నెల్లూరుకు చెందిన నలుగురు కిరాయి హంతకులకు రూ.2 లక్షలకు సుపారీ ఇచ్చింది. ఆగష్టు  తారీఖు నాడు అర్ధరాత్రి తర్వాత ప్రియుడు నలుగురు కిరాయి హంతకులతో కలిసి గొంతుకు తాడు బిగించి హత్య చేశారు. ఆ తర్వాత వంటగదిలో ఉరి వేసుకున్నట్టు చిత్రీకరించారు. కుటుంబ సభ్యులను నమ్మించే ప్రయత్నం చేసింది లక్ష్మీప్రియ. అయితే.. కొడుకు మృతిపై అనుమానాలున్న తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు చేస్తున్న పోలీసులకు విస్తుగొలిపే విషయాలు తెలిశాయి.

చల్లా నరేంద్ర హత్య కేసును పోలీసులు వారం రోజుల వ్యవధిలోనే చేధించారు. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడన్న కోపంతో లక్ష్మీ ప్రియ నలుగురు కిరాయి హంతకులతో నరేంద్రను హత్య చేయించింది. ఇంట్లో నిద్రపోతున్న నరేంద్రను అర్ధరాత్రి గొంతు నులిమి చంపేశారు. అనంతరం ఉరి వేసుకున్నట్టు చిత్రీకరించారు. భర్త నరేంద్ర చనిపోయాడా? లేదా? అని తెలుసుకునేందుకు లక్ష్మీ ప్రియ అతడి గొంతుపై కాలు వేసి తొక్కి పైశాచికంగా ప్రకవర్తించినట్టు పోలీసులు తెలిపారు. చనిపోయిన తర్వాత ఉరి వేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు. తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన పోలీసులు లక్ష్మీ ప్రియా, శశి కుమార్, నహీద్, ఫజ్, సిద్ధిఖీ, ముబారక్ లను అరెస్టు చేశారు.

newsline-whatsapp-channel
Tags : ap-news andhrapradesh crime

Related Articles