Viral: నాలుక కోసి అమ్మవారికి సమర్పించిన భక్తుడు.!


Published Oct 14, 2024 11:13:00 AM
postImages/2024-10-14/1728884650_devotee.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: దేశ వ్యాప్తంగా నవరాత్రి వేడుకలు అధ్భుతంగా జరిగాయి. దుర్గమ్మకు శక్తి మేర మొక్కులు చెల్లించుకున్నారు. మూఢభక్తి కొందరిది...శక్తి కొలది మొక్కులు కొందరివి. జగన్మాత ప్రాణాలు తీసుకోమని కాని మిమ్మల్ని మీరు బాధపెట్టుకోమని ఎప్పుడు చెప్పదు. అయినా కొందరు పిచ్చిగా ఉంటారు. వాళ్లని ఏం చెయ్యలేం. రీసెంట్ గా ఓ భక్తుడు అమ్మవారికి మొక్కుకొని తన నాలుకను కానుకగా సమర్పించుకున్నాడు.


మధ్యప్రదేశ్‌లోని భింద్ జిల్లాలోని రతన్‌గఢ్ దేవి ఆలయానికి వచ్చిన ఒక భక్తుడు తన నాలుకను కోసుకుని, దానిని అమ్మవారి సమర్పించాడు. రతన్‌గర్ దేవి ఆలయం భిండ్‌లోని లాహర్ నగర్‌లో ఉంది. ఈ ఆలయాన్ని 2015లో నిర్మించారు. నవరాత్రుల్లో అమ్మవారికి మొక్కుకొని రక్తం చూపిస్తానని మొక్కుకొని తన నాలుకను కోసుకొని కానుక ఇచ్చాడు. 


నవరాత్రుల సందర్భంగా ఆలయానికి వచ్చిన రామ్‌శరణ్ భగత్ తన నాలుకను తెగ్గోసుకుని, అమ్మవారికి సమర్పించాడు. తరువాత ఆ రక్తాన్ని ఆలయం వెలుపల ఉంచిన పాత్రలో పోశాడు. దీనిని చూసిన అక్కడివారంతా తెగ ఆశ్చర్యపోయారు. నాలుకను సమర్పించాక ఆ భక్తుడు ఆలయంలోనే కాసేపు నిద్రించాడు. ఇక  రామ్ శరణ్ భగత్ ను చూడడానికి భక్తులు క్యూ కడుతున్నారు. 

newsline-whatsapp-channel
Tags : viral-news madhya-pradesh navaratri durgadevi-navaratri

Related Articles