RATAN TATA: ‘రతన్ టాటా’కు 11 వేల రత్నాలతో నివాళి !

సూరత్ కు చెందిన వజ్రాల వ్యాపారి లాబ్ లో తయారు చేసిన 11 వేల వజ్రాలతో ఆయన ఫొటోను చేయించారు.


Published Oct 14, 2024 02:43:00 PM
postImages/2024-10-14/1728897278_FotoJet20241013T232305.647635x430.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఒక భారతీయ ప్రముఖుడికి భారతరత్న పురస్కారానికి ఇవ్వాలి ప్రజలంతా కోరితే...అసలు ఆ ప్రచారాన్ని ఆపేయాలని కోరిన విశిష్ఠ వ్యక్తితత్వం రతన్ టాటాది. భారతీయులు తమ జాతిరత్నంగా భావించే ఆయన గత వారంలో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవటం తెలిసిందే.  భారతీయ రత్నానికి ఘన నివాళిని అర్పించారు ఓ జ్యూయలరీ షాప్ వారు.


గుజరాత్ కు చెందిన ఒక వజ్రాల వ్యాపారి చేసిన ప్రయోగం విపరీతంగా ఆకట్టుకుంటోంది. సూరత్ కు చెందిన వజ్రాల వ్యాపారి లాబ్ లో తయారు చేసిన 11 వేల వజ్రాలతో ఆయన ఫొటోను చేయించారు. ఈ వ్యాపారి పేరు విఫుల్ బాయ్ ఈయన పోస్టు చేసిన వీడియో ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


రత్నానికి....రత్నాలతో నివాళులర్పించారంటున్నారు నెటిజన్లు. ఆయన పోస్టు చేసిన వీడియో.. ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక భారీ రత్నానికి వేలాది రత్నాలు పోటీ పడి మరి ఒక చోట కుదురుగా కూర్చుంటే ఎంత అద్భుతమైన చిత్తరువు తయారవుతుందన్న దానికి నిదర్శనంగా ఈ ఫోటో నిలుస్తుంది. రతన్ టాటా కు ఇలాంటి నివాళులు ఎన్ని అర్పించిన అతని రుణం తీర్చుకోలేమంటూ కామెంట్లు పెడుతున్నారు.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu viral-news ratan-tata

Related Articles