ASR: అర్ధరాత్రి అరెస్ట్ పేరుతో జర్నలిస్ట్‌పై హత్యాయత్నం..?

చిన్న పిల్లలు, హార్ట్ పేషంట్ అయిన తన తల్లి, ఆడవారు ఉన్నారని కూడా చూడకుండా విచక్షణారహితంగా ఇంట్లోకి చొరబడే ప్రయత్నం చేశారని వెల్లడించారు. 


Published Aug 22, 2024 01:46:04 PM
postImages/2024-08-22/1724314564_akulasrinivasreddy.jpg

న్యూస్ లైన్ డెస్క్: అర్ధరాత్రి వేళ అరెస్ట్ పేరుతో పోలీసులు తనపై హత్యాయత్నానికి పాల్పడ్డారని జర్నలిస్ట్ ఆకుల శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంత రావు గురించి ఓ కథనం రాసినందుకు ఆయనను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. 

బుధవారం అర్ధరాత్రి తన ఇంట్లోకి వచ్చేందుకు ప్రయత్నించారని ఆయన వెల్లడించారు. చిన్న పిల్లలు, హార్ట్ పేషంట్ అయిన తన తల్లి, ఆడవారు ఉన్నారని కూడా చూడకుండా విచక్షణారహితంగా ఇంట్లోకి చొరబడే ప్రయత్నం చేశారని వెల్లడించారు. 

మల్కాజ్‌గిరి నుండి కొంత మంది అనుమానితులతో పోలీసులు చేతులు కలిపినట్టు సమాచారం ఉందని ఆయన తెలిపారు. తప్పు చేసిన వారిని ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు పెట్టడం, హత్య చేయడానికి ప్రయత్నాలు చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. 
 

newsline-whatsapp-channel
Tags : telangana ap-news news-line newslinetelugu brs telanganam journalist-akula-srinivas-reddy ts24-channel mainampalli-hanumantharao

Related Articles