Corruption: ఏసీబీ వలలో కమర్షియల్‌ ట్యాక్స్‌ అధికారిణి

మొత్తం రూ.35 వేల లంచం తీసుకుంటుండగా ఆమెను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నామని ఏసీబీ అధికారాలు వెల్లడించారు. 


Published Aug 23, 2024 06:54:37 PM
postImages/2024-08-23/1724419477_NarayanagudaCircle.jpg

న్యూస్ లైన్ డెస్క్: ఏసీబీ వలలో కమర్షియల్‌ ట్యాక్స్‌ అధికారిణి చిక్కుకుంది. నారాయణగూడా సర్కిల్ డిప్యూటీ కమర్షియల్‌ ట్యాక్స్‌ అధికారిణి వసంత ఇందిరా లంచం తీసుకుంటుండంగా పట్టుబడినట్లు యాంటీ కరప్షన్ బ్యూరో(ACB) అధికారులు తెలిపారు. మొత్తం రూ.35 వేల లంచం తీసుకుంటుండగా ఆమెను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నామని ఏసీబీ అధికారాలు వెల్లడించారు. 

వసంత ఇందిరాను అరెస్ట్ చేశామని వెల్లడించారు. అరెస్టు తరువాత హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టులో ఎస్పీఈ, ఏసీబీ కేసులకు సంబంధించి ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి ఎదుటఆమెను హాజరుపరిచారు. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉన్నట్లు తెలుస్తోంది.
 

newsline-whatsapp-channel
Tags : telangana news-line newslinetelugu telanganam acb-raids deputy-commercial-tax-officer vasantha-indira narayanaguda-circle

Related Articles