Malasri: ప్రేమఖైదీ హీరోయిన్ మీకు గుర్తుందా..?ఆమె కొడుకు కూడా హీరో రేంజ్...

1991 సమయంలో  హీరోయిన్ మాలాశ్రీ అద్భుతమైన నటనతో  ప్రేక్షకులు ఆదరాభిమానాలు పొందింది. ఈ సమయంలోనే "ప్రేమఖైదీ" చిత్రంలో నటించింది.  ఇవివి సత్యనారాయణ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీలో హరీష్ హీరోగా నటించారు.  అయితే ఈ మూవీ అద్భుతమైన హిట్ సాధించడంతో ఆ తర్వాత ఆమెకు సాహస వీరుడు సాగర కన్య, భలే మామయ్య వంటి చిత్రాల్లో ఆఫర్స్ వచ్చాయి.  అలా తెలుగులో చేసిన ఆమె చిత్రాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి.  ఆ తర్వాత మాలశ్రీ తెలుగు నుంచి కన్నడ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయిపోయి అక్కడ స్టార్ హీరోయిన్ హోదా పొందింది.అక్కడే ప్రొడ్యూసర్ రాముతో  కలిసి పని చేసింది.  "ముత్యనంత హేంతి" అనే చిత్ర సమయంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు.


Published Jul 24, 2024 04:23:55 AM
postImages/2024-07-24/1721796287_mala.jpg

న్యూస్ లైన్ డెస్క్: ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీని రఫ్ఫాడించిన కొంతమంది నటీనటులు పెళ్లిళ్లు ఇతర కార్యక్రమాల దృష్ట్యా ఇండస్ట్రీకి దూరమైపోయారు. ఇండస్ట్రీని వదిలి వేరే ఇండస్ట్రీలో సెట్ అయిపోయారు. అలా వదిలేసి వెళ్లిపోయిన వారు ప్రస్తుతం మళ్ళీ సోషల్ మీడియాలో వారికి సంబంధించిన పాత సినిమాల గురించి ప్రస్తావిస్తుండడంతో  వీరు పలానా వారా అంటూ మనమే చూసి షాక్ అయిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా పని చేసిన అమ్మాయిలు, అబ్బాయిలు  ప్రస్తుతం హీరో హీరోయిన్ కటౌట్స్ తో మన ముందుకు వచ్చి అందరినీ ఆశ్చర్య పరుస్తున్నారు.

అలాంటి ఈ తరుణంలో 1991 సమయంలో  హీరోయిన్ మాలాశ్రీ అద్భుతమైన నటనతో  ప్రేక్షకులు ఆదరాభిమానాలు పొందింది. ఈ సమయంలోనే "ప్రేమఖైదీ" చిత్రంలో నటించింది.  ఇవివి సత్యనారాయణ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీలో హరీష్ హీరోగా నటించారు.  అయితే ఈ మూవీ అద్భుతమైన హిట్ సాధించడంతో ఆ తర్వాత ఆమెకు సాహస వీరుడు సాగర కన్య, భలే మామయ్య వంటి చిత్రాల్లో ఆఫర్స్ వచ్చాయి.  అలా తెలుగులో చేసిన ఆమె చిత్రాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి.  ఆ తర్వాత మాలశ్రీ తెలుగు నుంచి కన్నడ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయిపోయి అక్కడ స్టార్ హీరోయిన్ హోదా పొందింది.

అక్కడే ప్రొడ్యూసర్ రాముతో  కలిసి పని చేసింది.  "ముత్యనంత హేంతి" అనే చిత్ర సమయంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. వీరికి ఆర్యన్, అనన్య అని ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. అయితే 2021లో మాలశ్రీ భర్త రాము కరోనా వల్ల మరణించాడు. అప్పటినుంచి మాలశ్రీ పిల్లలిద్దరిని పెంచుకుంటూ వస్తోంది.  వారి అభిరుచి ప్రకారమే నటనపై ఆసక్తి ఉండడంతో వారిద్దరిని ఇండస్ట్రీలోకి తీసుకురావాలని చూస్తోంది.

ఇప్పటికే కూతురు అనన్య కథానాయకగా  స్టార్ హీరో దర్శన్ నటించిన కాటిరా సినిమాలో నటించింది.  సినిమా సూపర్ హిట్ అవ్వడంతో అనన్య పేరు ఎక్కడికో వెళ్లిపోయింది. ఇక కొడుకు ఆర్యన్ కూడా ఏమాత్రం హీరో రేంజ్ కు తక్కువ లేని కటౌట్ తో ఉన్నారు. తాజాగా ఆయన లేటెస్ట్ ఫోటోస్ ను  మాలశ్రీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారాయి.  అయితే ఈయన విదేశాల్లో సినిమా కోర్సు కు సంబంధించి ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Malashree Ramanna (@malashreeramu)

newsline-whatsapp-channel
Tags : newslinetelugu mala-shri aaryan ananya sahasa-veerudu-sagara-kanya-movie

Related Articles