UPI Payments: యూపీఐ యూజర్లకు షాక్.. సర్వీసులు నిలిపివేత

యూపీఐ యూజర్లకు ఊహించని షాక్ తగిలింది. రేపు మూడు గంటల పాటు యూపీఐ సర్వీసులు నిలిపివేస్తున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ శుక్రవారం ప్రకటనలో వెల్లడించింది.


Published Aug 09, 2024 07:29:01 PM
postImages/2024-08-09//1723211941_upi2.PNG

న్యూస్ లైన్ డెస్క్: యూపీఐ యూజర్లకు ఊహించని షాక్ తగిలింది. రేపు మూడు గంటల పాటు యూపీఐ సర్వీసులు నిలిపివేస్తున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ శుక్రవారం ప్రకటనలో వెల్లడించింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు తన యూపీఐ సేవలను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు తెలిపింది. రేపు ఉదయం 2:30 నుంచి 5:30 వరకు యూపీఐ సేవలు నిలిపేస్తున్నారు. ఆగస్టు 10న సిస్టమ్ మెయింటెనెన్స్ కారణంగా మూడు గంటల పాటు వినియోగదారులకు యూపీఐ సేవలు అందుబాటులో ఉండవని స్పష్టం చేసింది. ఈమేరకు బ్యాంక్ ఒక ప్రకటన విడుదల చేసింది. దీంతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు యూజర్లు ఆందోళన చెందుతున్నారు. తమ లావాదేవీలను ఎలా చేయాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

newsline-whatsapp-channel
Tags : telangana upi payments problems

Related Articles