JrNtr:వరద బాధితులకు ఎన్టీఆర్ భారీ విరాళం..!

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో తాతకు తగ్గ మనవడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన నందమూరి కుటుంబానికి ఎంత దగ్గర అవ్వాలనుకుంటున్న వారిని దూరం పెడుతూనే


Published Sep 03, 2024 10:36:02 AM
postImages/2024-09-03/1725339962_jrntr1.jpg

న్యూస్ లైన్ డెస్క్: జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో తాతకు తగ్గ మనవడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన నందమూరి కుటుంబానికి ఎంత దగ్గర అవ్వాలనుకుంటున్న వారిని దూరం పెడుతూనే వస్తున్నారు. వారు ఎంత దూరం పెడతారో ఎన్టీఆర్ అంత ఎదిగి చూపిస్తున్నారు తప్ప వెనక్కి తగ్గడం లేదు. అలాంటి ఎన్టీఆర్  తాత లాగే గొప్ప మనసున్న వ్యక్తి. తన అభిమానుల కోసం కానీ పేద ప్రజల కోసం కానీ ఎప్పుడు తాపత్రయపడుతూ ఉంటారు..  

తాజాగా జూనియర్ ఎన్టీఆర్ రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాల కారణంగా  వరదల్లో చిక్కుకొని నష్టపోయినటువంటి వరద బాధితులకు ఆసరాగా నిలిచారు. తనవంతు సహకారం అందించారు. ఇంతకీ ఎన్టీఆర్ ఏం చేశారంటే.. తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధులకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోటి రూపాయల విరాళం అందిస్తున్నట్టు తాజాగా ప్రకటించారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం వల్ల ఎంతో మంది ప్రజలు నిరాశ్రయులయ్యారని, వాళ్ళని చూస్తే నా గుండె కలసివేసిందని, వీరంతా విపత్తు నుంచి త్వరగా కోలుకోవాలని దేవున్ని ప్రార్థిస్తున్నానని అన్నారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధులకు జూనియర్ ఎన్టీఆర్  50 లక్షల రూపాయలు విరాళాన్ని అందించి గొప్ప మనసు చాటుకున్నారు. దీంతో నందమూరి అభిమానులంతా మా అన్న మనస్సు గొప్పది, చాలా మంచి వ్యక్తి అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి ఎన్టీఆర్ ను చూసిన మిగతా స్టార్లు  ముందుకు వస్తారా లేదా అనేది ముందు ముందు తెలుస్తుంది.

newsline-whatsapp-channel
Tags : telangana chandrababu andhrapradesh rain-alert cm-revanth-reddy jr-ntr tollywood devara helping 1-cr-help

Related Articles