Kaliyuga pandavlu:"కలియుగ పాండవులు" 38 ఏళ్ళు..ఖుష్బూ ఎమోషనల్ పోస్ట్.!

దగ్గుపాటి వెంకటేష్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి వివాదాలు లేని హీరో. కేవలం తనకు సినిమాలు, కుటుంబం తప్ప ఇంకో విషయంపై ఆయన దృష్టి పెట్టరు. అలాంటి వెంకటేష్ ఇండస్ట్రీలో ఎలాంటి


Published Aug 14, 2024 08:18:00 PM
postImages/2024-08-14/1723645487_kushboo.jpg

న్యూస్ లైన్ డెస్క్: దగ్గుపాటి వెంకటేష్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి వివాదాలు లేని హీరో. కేవలం తనకు సినిమాలు, కుటుంబం తప్ప ఇంకో విషయంపై ఆయన దృష్టి పెట్టరు. అలాంటి వెంకటేష్ ఇండస్ట్రీలో ఎలాంటి పాత్రలో అయినా దూసుకెళ్లే  హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక వెంకటేష్ కామెడీ చిత్రాల గురించి చెప్పనక్కర్లేదు. అద్భుతమైన కామెడీతో కడుపుబ్బా నవ్వించగల సత్తా కలిగిన హీరో. లవ్, కామెడీ ఇలా ఏ పాత్రలో అయినా  ఆయన దూరిపోతారు. అలాంటి వెంకటేష్ హీరోగా వచ్చినటువంటి 'కలియుగ పాండవులు' సినిమా  ఇండస్ట్రీలో రిలీజ్ అయ్యి 38 సంవత్సరాలు గడుస్తోంది.

ఆగస్టు 14 1986లో ఈ చిత్రం రిలీజ్ అయింది. అయితే ఇందులో వెంకటేష్ సరసన కథానాయికగా కుష్బూ నటించింది. అయితే ఆ హీరోయిన్ ఈ చిత్రంతోనే తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి మొదటిసారి ఎంట్రీ ఇచ్చింది. ఆమె చేసిన మొదటి చిత్రమే సూపర్ హిట్ అవడంతో అనతి కాలంలోనే మంచి హీరోయిన్ గా గుర్తింపు పొందింది.  ఆ తర్వాత వరుసగా నాగార్జున చిరంజీవి వంటి హీరోలతో కూడా సినిమాలు చేసింది. అలా తెలుగులోకి వచ్చిన కొద్ది కాలంలోనే దక్షిణాది మొత్తంలో స్టార్ హీరోయిన్ గా మారింది కుష్బూ. ప్రస్తుతం ఈమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాజకీయాల్లో రాణిస్తోంది.  అలాంటి ఖుష్బూ తాజాగా ఈ సినిమా గురుంచి ప్రస్తావిస్తూ ఎమోషనల్ ట్వీట్ చేసింది.

నా సౌత్ ఇండియా మొదటి చిత్రానికి 38 ఏళ్లు గడిచాయి. ఇందులో వెంకటేష్ పక్కన నేను నటించడం నా అదృష్టం. ఆయన ఇప్పటికీ నాకు స్నేహితుడిగానే ఉన్నారు.  అప్పట్లో చిత్ర యూనిట్ మొత్తం నన్ను కుటుంబంలా ఆదరించారు. తెలుగు ప్రేక్షకులు నాపై చూపించిన ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటానని పోస్ట్ చేసింది. అయితే ఈ చిత్రానికి కే రాఘవేంద్రరావు డైరెక్షన్ చేశారు. వెంకటేష్ నాన్న రామానాయుడు ప్రొడ్యూసర్ గా పని చేశారు. ప్రస్తుతం ఆమె ఈ పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

newsline-whatsapp-channel
Tags : chiranjeevi newslinetelugu venkatesh nagarjuna kushboo kaliyuga-pandavlu

Related Articles