Karan Johar: : ఫాదర్స్ డే రోజు కరణ్ జోహార్ ఎమోషనల్ పోస్ట్ !

2017 లో సరోగసీ ద్వారా యశ్ , రూహీ అనే కవలలకు కరణ్ జోహార్ తండ్రయ్యారు. ఈ నిర్ణయం తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని ఆయన తెలిపారు.


Published Jun 15, 2025 02:00:00 PM
postImages/2025-06-15/1749976293_karanjoharkids.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ ; బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహర్ ఫాదర్స్ డే సంధర్భంగా పిల్లలతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. సరోగసీ ద్వారా తండ్రిని కావాలన్న నిర్ణయం జీవితంలో అత్యంత సంతృప్తిని ఇచ్చిన విషయం  . సింగిల్ పేరెంట్ గా ఎన్నో సవాళ్లు ఎదుర్కొవాలని ఆయన అన్నారు. 2017 లో సరోగసీ ద్వారా యశ్ , రూహీ అనే కవలలకు కరణ్ జోహార్ తండ్రయ్యారు. ఈ నిర్ణయం తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని ఆయన తెలిపారు.


"కొన్ని నిర్ణయాలు హఠాత్తుగా తీసుకుంటాం, కొన్ని వ్యూహాత్మకంగా ఉంటాయి, మరికొన్ని దైవానుగ్రహంతో జరుగుతాయి. నిజానికి నా జీవితం మొత్తం నా పిల్లలే నా మంచి నిర్ణయం. యశ్, రూహీ తన జీవితానికి కొత్త అర్థాన్ని, పరిపూర్ణతను ఇచ్చారని 53 ఏళ్ల కరణ్ జోహార్ తెలిపారు. "నా పిల్లలు నాలోని లోటును భర్తీ చేశారు. నా హృదయంలో ప్రేమకు మరింత స్థానం కల్పించారు. నా ఉనికిని పూర్తిచేసిన నా ఆశీస్సులు రూహీ, యశ్‌లకు ఫాదర్స్ డే శుభాకాంక్షలు" అంటూ తన పిల్లల ఫోటోను కూడా పంచుకున్నారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu producer bolly-wood kids

Related Articles